BJP: ఏపీ, తెలంగాణలో భాజపా లోక్‌సభ అభ్యర్థులు వీరే!

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితాను భాజపా విడుదల చేసింది.

Updated : 25 Mar 2024 15:46 IST

అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితాను ఆదివారం రాత్రి భాజపా అధిష్ఠానం విడుదల చేసింది. తెదేపా, జనసేనతో పొత్తులో భాగంగా భాజపాకు 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేయగా అందులో ఏపీ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి ఇద్దరిని ఖరారు చేసింది. ఏపీలో అసెంబ్లీ అభ్యర్థులను సోమవారం ప్రకటించే అవకాశముందని సమాచారం.

తెలంగాణ లోక్‌సభ అభ్యర్థులు..

  • వరంగల్‌ (ఎస్సీ): ఆరూరి రమేశ్‌
  • ఖమ్మం: తాండ్ర వినోద్‌రావు

ఏపీ లోక్‌సభ అభ్యర్థులు..

  • అరకు : కొత్తపల్లి గీత
  • అనకాపల్లి: సీఎం రమేష్
  • రాజమహేంద్రవరం : పురందేశ్వరి
  • నర్సాపురం : భూపతిరాజు శ్రీనివాస వర్మ
  • తిరుపతి (ఎస్సీ) : వరప్రసాదరావు
  • రాజంపేట : కిరణ్ కుమార్ రెడ్డి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని