ఎన్నికల కార్యాలయంలోనే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు: ముఖేశ్‌కుమార్‌ మీనా

ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకు నేరుగా అందించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు.

Published : 05 Apr 2024 15:44 IST

అమరావతి: ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకే నేరుగా అందించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సీఈవో కార్యాలయంలో ప్రతిరోజూ సాయంత్రం 4-5 గంటల మధ్య ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తామన్నారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయొచ్చన్నారు. సెలవు రోజుల్లోనూ సీఈవో కార్యాయలం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.47.5 కోట్ల విలువైన నగదు, మద్యం, వెండి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీనా వెల్లడించారు. 5.13 లక్షల లీటర్ల మద్యం, పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్లు చెప్పారు. ఎన్నికల్లో పంచేందుకు తీసుకెళ్తున్న ఉచితాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మీనా వెల్లడించారు. సీజర్లకు సంబంధించి 4337 కేసులు, కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి 247 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,681 లైసెన్స్‌ కలగిన ఆయుధాలను ఆయా పోలీస్‌ స్టేషన్లలో జమ చేశారని మీనా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు