Buddha Venkanna: బుద్దా వెంకన్నకు ఏపీ సీఐడీ నోటీసులు

తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్నకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

Published : 03 Nov 2023 19:28 IST

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్నకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. జడ్జిలను దూషించారన్న అభియోగాలపై ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం పలు ఆరోగ్య పరీక్షల కోసం బుద్దా వెంకన్న హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో హైదరాబాద్ వెళ్లిన సీఐడీ అధికారులు.. నేరుగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. వెంటనే వివరణ ఇవ్వాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని