Dharmana: విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి: మంత్రి ధర్మాన

విశాఖలో రాజధాని ఏర్పాటైతే మన భవిష్యత్‌ బాగుంటుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీనికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని.. విశాఖ రాజధాని అని ఏకకంఠంతో మాట్లాడితే చాలన్నారు.

Updated : 07 Oct 2022 15:09 IST

అరసవల్లి: విశాఖలో రాజధాని ఏర్పాటైతే మన భవిష్యత్‌ బాగుంటుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీనికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని.. విశాఖ రాజధాని అని ఏక కంఠంతో మాట్లాడితే చాలన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై మంత్రి ఘాటుగా స్పందించారు. ‘‘మా పీక కోసేందుకు అమరావతి నుంచి అరసవల్లికి వస్తారా? మా ప్రాంతాలు అభివృద్ధి చెందనక్కర్లేదా? విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి’’ అని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు