ఎన్నికల్లో కేజ్రీవాల్ కాంగ్రెస్కు, రాహుల్ ఆప్నకు ఓటేస్తారు:రాఘవ్ చద్దా
శస్ర్త చికిత్స అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆప్ నేత రాఘవ్ చద్దా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తోందని పేర్కొన్నారు.
దిల్లీ: కంటి శస్త్రచికిత్స అనంతరం దిల్లీకి తిరిగొచ్చిన ఆమ్ ఆద్మీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కాంగ్రెస్కు ఓటేస్తారని, రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆప్నకు ఓటేస్తారని తెలిపారు. దక్షిణ దిల్లీలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాహి రామ్ పహిల్వాన్కు మద్దతుగా చద్దా ఎన్నికల సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి వచ్చాయని పేర్కొన్నారు. మన ఓటుపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.
ఆప్ అధికారంలోకి వచ్చాక దిల్లీ ప్రజలు విద్యుత్, మందులు, నీరు, పాఠశాల ఫీజులపై నెలకు సుమారు రూ.18,000 ఆదా చేసుకోగలుతున్నారని చద్దా అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ కూటమి విజయంపై విశ్వాసం వ్యక్తంచేసిన రాఘవ్ చద్దా.. ఈసారి దక్షిణ దిల్లీలో అత్యధిక ఓట్లతో గెలుస్తామని దీమా వ్యక్తంచేశారు. మే 25న ప్రజలు చీపురు గుర్తుకు ఓటేయాలని కోరారు.
2019లో రాఘవ్ చద్దా దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, భాజపా అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు. దిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలివి
జల్జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖల మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. -
కోడెలపై పెట్టిన సెక్షన్లతోనే జగన్పైనా కేసు పెట్టాలి
తాడేపల్లిలోని తన ఇంటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పట్లో రూ.18 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని, దాంతోనే అక్కడ విద్యుత్ ఫెన్సింగ్ సహా పలు రకాల సామగ్రి సమకూర్చుకున్నారని, ఆ సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించకపోగా.. అదే ఇంట్లో ఇప్పుడు పార్టీ కార్యకలాపాలు నిర్వహించడమేంటని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం ధ్వజమెత్తారు. -
పుంగనూరులో ఉద్రిక్తత.. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ తెదేపా కార్యకర్తల ర్యాలీ
చిత్తూరు జిల్లా పుంగనూరులో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రావడానికి వీల్లేదంటూ తెదేపా నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్?
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లు తెలిసింది. -
ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్పై మరోసారి దర్యాప్తు జరపాలి
విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు, ఆయన సహచరుడు జీవీ కిడ్నాప్ కేసును మరోసారి దర్యాప్తు చేయాలని జనసేన నాయకుడు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. -
జగన్ది నీచ రాజకీయం: మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్
ఎంపీలు 22 మంది ఉన్నా ఐదేళ్లలో ఏనాడూ ప్రత్యేక హోదాపై నోరెత్తని వైకాపా అధినేత జగన్.. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు.