నకిలీ ఆడియోల నిలయంగా గహ్లోత్ నివాసం
రాజస్థాన్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడారన్న కాంగ్రెస్ ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నివాసం ....
(రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్)
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడారన్న కాంగ్రెస్ ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నివాసం నకిలీ ఆడియోలకు నిలయంగా మారిందని ఎద్దేవా చేసింది. నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా ఆయనను విమర్శించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో ప్రభుత్వమంతా రిసార్టులో దాచుకోవడం దురదృష్టకరమని పూనియా అన్నారు. ప్రభుత్వానికి నిజంగానే పూర్తి ఆధిక్యత ఉంటే శిబిర రాజకీయాలు ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల ప్రతిష్ఠను దిగజార్చాలన్న ఉద్దేశంతో ఎస్ఓజీ, ఏసీబీని వాడుకుంటోందని ఆరోపించారు.
‘రాజస్థాన్ రాజకీయాల్లో ఈ రోజు జరిగింది సిగ్గుచేటు. ముఖ్యమంత్రి నివాసం నకిలీ ఆడియోలకు నిలయంగా మారింది. ఆయన ఇతర నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలోకి కేంద్ర మంత్రుల్ని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కుర్చీని కాపాడుకొనేందుకు గహ్లోత్ ఎంతకు తెగించేందుకైనా వెనుకాడరు. వారి అంతర్గత కలహాలకు భాజపాను నిందిస్తున్నారు. వాళ్ల గురించి వాళ్లు ఆందోళన చెందాలి. అంతేకానీ వాళ్ల అంతర్గత విభేదాలకు భాజపా, కేంద్ర నాయకత్వాన్ని ఎందుకు నిందించాలి’ అని పూనియా ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్