Amit Shah: అశోక్ గహ్లోత్ రాజీనామా చేయాల్సిందే: అమిత్ షా
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు.
జైపుర్: దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన ‘రెడ్ డైరీ’ (Red Diary) అంశానికి బాధ్యత వహిస్తూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) డిమాండ్ చేశారు. ఆ డైరీలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి, చీకటి ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు. రాజస్థాన్లో గంగాపుర్ పట్టణంలో నిర్వహించిన ‘సహకార్ కిసాన్ సమ్మేళన్’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ బడ్జెట్ను ఆరు రెట్లు పెంచామని గుర్తు చేశారు. అంతేకాకుండా రైతు సహకార సంఘాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అమిత్ షా ప్రసంగిస్తుండగా.. కొందరు భాజపాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. ‘ ఈ సమావేశానికి కొంత మందిని పంపించి వ్యతిరేక నినాదాలు చేయించినంత మాత్రాన ఏమీ సాధించలేరని గహ్లోత్కు ఈ వేదికపై నుంచి చెబుతున్నా. ఏమాత్రం సిగ్గున్నా..వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్నికలకు దిగండి.’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మధ్య గహ్లోత్కు ఎరుపు రంగును చూస్తే విపరీతమైన కోపం వచ్చేస్తోందని ఎద్దేవా చేశారు. డైరీ ఎరుపు రంగులో ఉన్నా.. అందులోని ఒప్పందాలు మాత్రం నల్లనివేనని విమర్శించారు. రూ.వేల కోట్ల అవినీతికి సంబంధించిన వివరాలు ఆ డైరీలో ఉన్నాయని అన్నారు.
ఇటీవల రాజస్థాన్లో రెడ్ డైరీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న వివరాలు అందులో ఉన్నాయంటూ ఇటీవల ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుఢా రెడ్ డైరీ ప్రస్తావనను అసెంబ్లీలో తెచ్చారు. రాజస్థాన్ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్లో అవకతవకలకు సంబంధించి ఛైర్మన్ ధర్మేంద్ర రాఠోడ్ ఇంట్లో ఈడీ, ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సూచన మేరకు తాను రెడ్ డైరీని జాగ్రత్త పరిచానని రాజేంద్ర గుఢా తెలిపారు. అశోక్ గహ్లోత్, ఆయన కుమారుడు వైభవ్ గహ్లోత్ల సూచనల మేరకు డబ్బును ఎమ్మెల్యేలకు ఇచ్చానని రాఠోడ్ ఆ రెడ్ డైరీలో రాశారని వివరించారు. దీంతో ఇటీవల లోక్సభ సమావేశాల్లోనూ ఈ అంశం తీవ్ర దుమారం రేపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు