Babu Mohan: కేఏ పాల్‌ పార్టీలో చేరిన బాబూమోహన్‌.. ఎంపీగా పోటీ

మాజీ మంత్రి, సినీ నటుడు బాబూమోహన్‌ (Babu Mohan) ప్రజాశాంతి పార్టీలో చేరారు. 

Published : 04 Mar 2024 16:09 IST

హైదరాబాద్: మాజీ మంత్రి, సినీ నటుడు బాబూమోహన్‌ (Babu Mohan) ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు కేఏ పాల్‌ (KA Paul) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి బాబూమోహన్‌ పోటీ చేస్తారని కేఏ పాల్‌ ప్రకటించారు.

కాగా, ఇటీవల భాజపాకు బాబూమోహన్‌ రాజీనామా విషయం తెలిసిందే. పార్టీలోని గ్రూపులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ ఎంపీ టికెట్‌ను ఆశించానని.. అది ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు