Bandi Sanjay: భారాస ప్రభుత్వం వస్తే బీసీని సీఎం చేయగలరా?: బండి సంజయ్
బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని భాజపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు.
కరీంనగర్: బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని భాజపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. కరీంనగర్లో మీడియాతో సంజయ్ మాట్లాడారు.
రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడితే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని తమ పార్టీ ప్రకటించిందన్నారు. కేవలం బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా పేదల రాజ్యం రావాలని ఆలోచిస్తున్నారని చెప్పారు. భారాస ప్రభుత్వం ఏర్పడితే బీసీని లేదా గతంలో హామీ ఇచ్చినట్లుగా దళితుడిని సీఎంగా చేయగలరా? అని కేసీఆర్ను ఉద్దేశించి సంజయ్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.