Bandi Sanjay: ప్రధాని మోదీ వాస్తవాలు చెబితే ఉలుకెందుకు?: బండి సంజయ్‌

ప్రధాని మోదీకి కేటీఆర్‌ ఇచ్చిన కౌంటర్‌పై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ స్పందించారు.

Updated : 03 Oct 2023 22:22 IST

హైదరాబాద్: ఇందూరు జనగర్జన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మంత్రి కేటీఆర్‌ ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి కేటీఆర్‌ ఇచ్చిన కౌంటర్‌పై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ స్పందించారు. ప్రధాని మోదీ వాస్తవాలు చెబితే ఉలుకెందుకు? మోదీ చెప్పింది తప్పని నిరూపించగలరా? అని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేస్తారా అని సవాల్‌ విసిరారు. ‘‘సీఎం పదవి కోసం కేసీఆర్‌నే గోస పెడుతున్నావు. మీది ఫక్తు మోసకారి కుటుంబం. హద్దు మీరితే ప్రజలే మిమ్మల్ని తరిమికొడతారు’’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని