Bandi Sanjay: అందువల్లనే కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించట్లేదు: బండి సంజయ్‌

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Published : 06 Aug 2023 16:30 IST

కరీంనగర్‌: అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌ తీరు చూసి భారాస ఎమ్మెల్యేలు, కార్యకర్తలే చీదరించుకొనే పరిస్థితి నెలకొందన్నారు. అందువల్లనే కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించడం లేదని విమర్శించారు. దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుమారుడిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలా ప్రకటిస్తే పార్టీలో ఒక్కరు కూడా మిగలరని జోస్యం చెప్పారు. కరీంనగర్‌ రైల్వేస్టేషన్ ఆధునీకీకరణ పనులకు బండి సంజయ్ హాజరయ్యారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్న ఈ కార్యక్రమానికి ఆర్డీవో తప్ప జిల్లా స్థాయి అధికారి ఎవరూ రాలేదని సంజయ్ విమర్శించారు. అసెంబ్లీలో రాజాసింగ్‌ను చూస్తేనే కేటీఆర్‌కు వణుకు పుడుతోందన్నారు. దమ్ముంటే గోషామహల్‌లో రాజాసింగ్‌పై కేటీఆర్‌ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని