Bandi Sanjay: ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్ని?: బండి సంజయ్
ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
హుజూరాబాద్: ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆయన పర్యటించారు. పలు వార్డుల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పోరాటాలు తాము చేస్తే.. అధికారం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుందని వ్యాఖ్యానించారు.
‘‘నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తారా? లేక గత ప్రభుత్వంలో సాదాసీదాగా నిర్మించిన రెండు పడకల గదులు ఇస్తారా? ప్రజాపాలన సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎన్ని? మీరిచ్చేవి ఎన్ని? హామీలు నెరవేస్తారనే కాంగ్రెస్కు ప్రజలు ఓట్లు వేశారు. కానీ, అధికారంలోకి రాగానే ఆ పార్టీ మాట మారుస్తోంది. షరతుల పేరుతో హామీల్లో కోతలు పెడుతోంది. వెయ్యి మందిని పెళ్లికి పిలిచి 10 మందికే అన్నం పెడతానంటే ఎలా? 100 రోజుల్లోపు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల చేతిలో పరాభవం తప్పదు’’ అని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సీనియర్ నేత సుశీల్కుమార్ కన్నుమూత
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
-
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
-
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్: అమిత్షా