Bandi Sanjay: కాంగ్రెస్‌ భవిష్యత్తు కేసీఆర్‌పై ఆధారపడి ఉంది: బండి సంజయ్‌

కాంగ్రెస్‌, భారాస, ఎంఐఎం ఎప్పుడూ కలిసే ఉంటాయని.. దిల్లీలో కాంగ్రెస్‌, భారాస నేతలు కలిసి మీడియా సమావేశం కూడా పెట్టారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు.

Published : 29 Oct 2023 14:44 IST

కరీంనగర్‌: కాంగ్రెస్‌, భారాస, ఎంఐఎం ఎప్పుడూ కలిసే ఉంటాయని.. దిల్లీలో కాంగ్రెస్‌, భారాస నేతలు కలిసి మీడియా సమావేశం కూడా పెట్టారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు. అన్ని పార్టీల టార్గెట్‌ భాజపా కాబట్టే తమపై దాడి చేస్తున్నారన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. 2014 తర్వాత 2018లో భాజపా ఓటింగ్‌ శాతం పెరిగిందని తెలిపారు. ఇలా క్రమంగా రాష్ట్రం మొత్తం తమ ఓటింగ్‌ శాతం పెరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్‌ భవిష్యత్తు సీఎం కేసీఆర్‌పై ఆధారపడి ఉందన్నారు. అందువల్లే కాంగ్రెస్‌ నేతలు భయాందోళనకు గురవుతున్నారని విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని