Bandi Sanjay: 21న అమరావతికి బండి సంజయ్‌.. ఏపీ భాజపాలో జోష్‌!

Published : 18 Aug 2023 18:14 IST

హైదరాబాద్‌: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్.. ఈనెల 21న అమరావతికి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియను ఆయన సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశా ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించే బాధ్యతను పార్టీ అధిష్ఠానం బండి సంజయ్‌కు అప్పగించింది. అయితే, బండి సంజయ్ ఎంట్రీతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోనూ బండి సంజయ్ సేవలను ఉపయోగించుకోవాలని అక్కడి పార్టీ నేతలు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు