Lok Sabha Elections: 9 ఓట్ల తేడాతో వీళ్లు.. 98శాతం ఓట్లతో వాళ్లు: లోక్సభ ఎన్నికల్లో ఈ రికార్డులు తెలుసా?
లోక్సభ ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీ ప్రీతమ్ ముండే..! మరి అత్యల్ప మెజార్టీ ఎవరిది? ఈ విశేషాలు చూద్దాం..!
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల్లో గెలవడం అంటేనే ఓ కిక్కు..! ఒక్కోసారి అది అఖండ మెజారిటీ కావొచ్చు.. కొన్నిసార్లు త్రుటిలో గట్టెక్కొచ్చు..! లోక్సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే సింగిల్ డిజిట్ తేడాతో విజయం సాధించారు. మరోవైపు ఓ అభ్యర్థి ఏకంగా 98శాతం ఓట్లతో గెలుపొందారు. మరి ఇప్పటివరకు అత్యధిక, అత్యల్ప మెజారిటీలేంటో తెలుసా?
చరిత్ర సృష్టించిన ప్రీతమ్ ముండే..
దేశ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో విజయం దక్కించుకున్న నేతగా గుర్తింపు సాధించారు భాజపా నాయకురాలు ప్రీతమ్ ముండే. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ఈ అరుదైన ఘనత అందుకున్నారు. కేంద్రమాజీ మంత్రి, మహారాష్ట్ర బీద్ ఎంపీ గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఆయన కుమార్తె ప్రీతమ్ పోటీ చేయగా... రికార్డు స్థాయిలో 6.96 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.
గత ఎన్నికల్లోనే నలుగురు..
ప్రీతమ్ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేకపోయారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు 6 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. వీరంతా భాజపా నేతలే.
గుజరాత్లోని నవసరిలో భాజపా నేత సీఆర్ పాటిల్ 6.89 లక్షల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
- హరియాణాలోని కర్నాల్లో సంజయ్ భాటియా 6.56 లక్షలు, ఫరీదాబాద్లో భాజపా అభ్యర్థి కృష్ణపాల్ గుజ్జర్ 6.38 లక్షల తేడాతో గెలుపొందారు.
- రాజస్థాన్లోని భిల్వాడాలో సుభాష్ బహేరియా 6.12 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
- అంతకుముందు 2004లో సీపీఎం నేత అనిల్ బసు ఆరంబాఘ్ (పశ్చిమ బెంగాల్) నుంచి 5.92 లక్షల మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు.
కేవలం 9 ఓట్ల తేడాతో..
సాధారణంగా భారీ మెజారిటీ దక్కిందంటే అక్కడ గెలుపు ఏకపక్షమైనట్లే..! అయితే కొన్నిసార్లు ప్రత్యర్థుల మధ్య విజయం దోబూచులాడుతుంది. చివరకు అత్యల్ప మెజార్టీతో గట్టెక్కాల్సి వస్తుంది. అలా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు ఎంపీలు కేవలం 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.
- 1989లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కొణతాల రామకృష్ణ తన సమీప అభ్యర్థిపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- 1998లో బిహార్లోని రాజ్మహల్ స్థానం నుంచి భాజపా నేత సోమ్ మరండి కూడా కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- 1996లో గుజరాత్లోని బరోడా నుంచి కాంగ్రెస్ నేత గైక్వాడ్ సత్యజీత్ సిన్హా 17 ఓట్ల తేడాతో నెగ్గారు.
- 1971లో తమిళనాడులోని తిరుచెందూర్లో డీఎంకే అభ్యర్థి ఎంఎస్ శివస్వామికి 26 ఓట్ల తేడాతో విజయం వరించింది.
- 2014లో లద్దాఖ్ స్థానం నుంచి భాజపా నేత తుప్స్తన్ చెవాంగ్ 36 ఓట్ల మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. 1962లో ఔటర్ మణిపుర్ స్థానం నుంచి రిషాంగ్ (మణిపుర్ ఆఫ్ సోషలిస్ట్ పార్టీ) 42 ఓట్లతో నెగ్గారు.
- 2004లో లక్షద్వీప్ నుంచి పోకున్హికోయ 71 ఓట్లు, 1980లో యూపీలోని దేవరియా నుంచి ఇందిరా కాంగ్రెస్ పార్టీకి చెందిన రామాయణ్ రాయ్ 77 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఆయనకు 98శాతం ఓట్లు..
పోలైన ఓట్లలో దాదాపు 90శాతం, అంతకంటే ఎక్కువే దక్కించుకుని లోక్సభలో అడుగుపెట్టిన ఎంపీలూ ఉన్నారు. 1989లో జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ స్థానం నుంచి పీఎల్ హండూకు (జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ) ఏకంగా 98శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో ఈ స్థానంలో 7.36లక్షల ఓటర్లుండగా.. కేవలం 5శాతం మంది అంటే 37,377 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 36,055 మంది హండూనే ఎన్నుకొన్నారు. నాడు ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో మెజారిటీ విజయం దక్కింది.
- ఇక, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1991లో నంద్యాల (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని) లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 89.5శాతం ఓటు షేరు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో 5లక్షల మెజారిటీతో విజయం సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టలేదు.
- లోక్జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత రామ్ విలాస్ పాసవాన్.. 1977లో జరిగిన ఎన్నికల్లో బిహార్లోని హజీపుర్ నుంచి 89శాతం ఓట్లు సాధించారు. మెజారిటీ 4,24,000 కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్