BJP: రాహుల్ గాంధీ ప్రత్యర్థిపై 242 క్రిమినల్ కేసులు
వయనాడ్ నుంచి భాజపా తరఫున బరిలోకి దిగుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
దిల్లీ: కేరళ భాజపా అధ్యక్షుడు, వయనాడ్ లోక్సభ అభ్యర్థి సురేంద్రన్పై (Surendran) 242 క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనపై నమోదైన కేసుల వివరాలను పత్రికాముఖంగా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఎర్నాకుళం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాధాకృష్ణన్పై (Radhakrishnan) 211 కేసులు ఉన్నాయి. వయనాడ్లో (Wayanad) కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ ఇద్దరు భాజపా అభ్యర్థులపై నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం 2018లో చోటుచేసుకున్న శబరిమల ఆందోళనల సమయంలోనివే కావడం గమనార్హం. వీటిలో చాలా వరకు ప్రస్తుతం విచారణ దశలోనే ఉన్నాయి. ఎక్కడైనా నిరసనలు చోటు చేసుకున్నప్పుడు దాంతో సంబంధం ఉందని భావించిన వారిపైనా కేసులు నమోదు చేశారని, ఈ క్రమంలోనే వీరిపై కేసులు ఎక్కువయ్యాయని భాజపా జనరల్ సెక్రెటరీ జార్జ్ కురియన్ మీడియాకు వెల్లడించారు.
సురేంద్రన్పై నమోదైన 242 కేసుల్లో 237 కేసులు శబరిమల ఆందోళలనలకు సంబంధించినవేనని, మిగతా 5 కేసులు కేరళలోని వివిధ నిరసన సమయాల్లో నమోదయ్యాయని కురియన్ తెలిపారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు స్థానిక ప్రభుత్వం ముందుకు రావడంతో తీవ్ర స్థాయిలో అందోళనలు రేగిన సంగతి తెలిసిందే. భాజపా, మిత్రపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనలకు నేతృత్వం వహించాయి. మరోవైపు మిగతాపార్టీ అభ్యర్థుల కేసుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేరళలోని 20 లోక్సభ స్థానాలకు రెండో విడతలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా