Maneka Gandhi: మేనకాగాంధీ ఒంటరిపోరు
అటు అయోధ్య...ఇటు అమేఠీ...ఉత్తర్ప్రదేశ్లోని రెండు ప్రముఖ ప్రాంతాల మధ్యనున్న సుల్తాన్పుర్ లోక్సభ నియోజకవర్గంలో నెలకొన్న త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది.
సుల్తాన్పుర్లో భాజపా, ఎస్పీలకు చెమటలు పట్టిస్తున్న బీఎస్పీ
సుల్తాన్పుర్: అటు అయోధ్య...ఇటు అమేఠీ...ఉత్తర్ప్రదేశ్లోని రెండు ప్రముఖ ప్రాంతాల మధ్యనున్న సుల్తాన్పుర్ లోక్సభ నియోజకవర్గంలో నెలకొన్న త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. భాజపా అభ్యర్థిగా మేనకా గాంధీ వరుసగా రెండో సారి బరిలో నిలవగా...ఆమె ప్రత్యర్థులుగా రాంభౌల్ నిషాద్ (ఎస్పీ), ఉద్రాజ్ వర్మ (బీఎస్పీ) ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 14,526 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన మేనకా గాంధీ వరుస విజయం కోసం శ్రమించాల్సి వస్తోంది. ఓబీసీ సామాజిక వర్గం కుర్మీలకు చెందిన ఉద్రాజ్ వర్మ...భాజపా, ఎస్పీ అభ్యర్థులకు గట్టి సవాల్ విసురుతున్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా రాంభౌల్ నిషాద్కు కాంగ్రెస్ మద్దతు లభిస్తున్నప్పటికీ ఓబీసీ ఓట్లలో చీలిక ఎస్పీ నేతలను కలవరపెడుతోంది. నిషాద్ సామాజిక వర్గంతో పాటు వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారీటీలపై ఎస్పీ ఆశలు పెట్టుకుంది. అయితే, ఈ వర్గాల్లో పట్టున్న బీఎస్పీ గత ఎన్నికల్లోనూ గట్టిపోటీ ఇచ్చి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా బలమైన కుర్మీల వర్గానికి చెందిన ఉద్రాజ్ వర్మను బరిలోకి దించి త్రిముఖ పోటీని రసవత్తరం చేసింది. అయోధ్యకు సమీపంలోనే ఉన్నప్పటికీ సుల్తాన్పుర్లో జాతీయ అంశాలు చర్చకు రావడం లేదు. రామాలయం అంశాన్ని దేశమంతటా ప్రస్తావిస్తున్న కమలం పార్టీ ఇక్కడ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. స్థానిక సమస్యలే తన ప్రాధాన్య అంశాలని ఆ పార్టీ అభ్యర్థి మేనకా గాంధీ విస్పష్టంగా చెబుతున్నారు. ఆమె తరఫున ప్రచారానికి వచ్చిన ఏకైక భాజపా అగ్రనేత రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన కూడా ఒక్క ఖాజీపుర్ సభలో మాత్రమే పాల్గొన్నారు. మేనకా గాంధీనే అన్నీ తానై చూసుకుంటున్నారు. ప్రచారం ముగింపు రోజైన గురువారం ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ఇక్కడకు వచ్చారు. దాదాపు 15 సమావేశాల్లో పాల్గొన్నారు.
వరుణ్కు ఈ దఫా ఫీలీభీత్ నియోజకవర్గ టికెట్ను భాజపా నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ప్రచారానికి రావడం ఇదే తొలిసారి. సుల్తాన్పుర్ నియోజకవర్గ ప్రజలు మేనకా గాంధీని ఎంపీ అని కాకుండా ‘మాతాజీ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారని, కులమతాలకు అతీతంగా అందరి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే తన తల్లికి ఓటు వేయాలని వరుణ్ విజ్ఞప్తి చేశారు. మేనకాగాంధీ కూడా ముస్లింలు సహా అన్ని వర్గాల ప్రజలను కలిసేందుకు ప్రయత్నించారు. దాదాపు 18 లక్షల ఓటర్లు ఉన్న ఈ లోక్సభ స్థానంలో మత్స్యకారుల ఓట్లు 2 లక్షల వరకు ఉన్నాయి. ఆ వర్గం నేత, భాజపా మిత్రపక్షం నిషాద్ పార్టీకి చెందిన సంజయ్ నిషాద్..రాష్ట్ర మంత్రిగా ఉన్నందున ఆ ఓట్లన్నీ తమకే వస్తాయని కమలదళ నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ-సీఎం ఆదిత్యనాథ్ ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న సానుకూలత తమను గెలిపిస్తుందని భాజపా జిల్లా అధ్యక్షుడు ఆర్.కె.వర్మ ధీమా వ్యక్తం చేశారు.సమాజ్వాదీ పార్టీ నాయకులు మాత్రం మేనకా గాంధీ స్థానికంగా నివాసం ఉండరని, దిల్లీ నుంచి వచ్చి నెలలో వారం రోజులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారని విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత, ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు, అభివృద్ధిలేమి అంశాలను ఎస్పీ అభ్యర్థి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థానాన్ని గెలుచుకోని ఎస్పీ ఈ దఫా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. 2019లో స్వల్ప తేడాతో ద్వితీయ స్థానంలో నిలిచిన బీఎస్పీ కూడా గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సుల్తాన్పుర్లో శనివారం (ఈనెల 26న) పోలింగ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు