Sandeshkhali: భాజపా అభ్యర్థిగా ‘సందేశ్ఖాలీ’ బాధితురాలు..
Sandeshkhali: సందేశ్ఖాలీలో షాజహాన్ షేక్కు వ్యతిరేకంగా గళమెత్తిన బాధిత మహిళకు భాజపా టికెట్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆమె బసిర్హట్ నుంచి పోటీ చేయనున్నారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని సందేశ్ఖాలీ (Sandeshkhali) గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన షాజహాన్ షేక్, అతడి అనుచరులు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లుు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఈ ప్రాంతం మరోసారి తెరపైకి వచ్చింది. ‘సందేశ్ఖాలీ’ వివాదంలో బాధిత మహిళకు భాజపా (BJP) టికెట్ ఇవ్వడమే ఇందుక్కారణం.
భాజపా ఆదివారం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో పశ్చిమ బెంగాల్లోని బసిర్హట్ స్థానం నుంచి రేఖా పత్రాను నిలబెట్టింది. ఈ లోక్సభ స్థానం పరిధిలోనే సందేశ్ఖాలీ గ్రామం ఉంది. షాజహాన్ షేక్ అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన రేఖ.. కొద్ది నెలల క్రితం ఇక్కడ మహిళలు చేపట్టిన ఆందోళనలకు నాయకత్వం వహించారు. అతడి అనుచరుల బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడమే గాక.. కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
కేరళలో భాజపా ఎంపీ అభ్యర్థిగా ఆరు భాషల ప్రవీణ అశ్విని
ఆందోళనల సమయంలో భాజపా నేత సువేందు అధికారి.. రేఖ ఇంటికి వెళ్లి అండగా నిలిచారు. ఇటీవల ప్రధాని మోదీ బరసత్ పర్యటనకు వచ్చిన సమయంలో రేఖతో పాటు సందేశ్ఖాలీ మహిళలు ఆయనతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కమలం పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. బసిర్హట్ లోక్సభ నియోజకవర్గానికి ప్రస్తుతం టీఎంసీ నేత, నటి నుష్రత్ జహాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఆమెను పక్కనబెట్టి హజీ నురుల్ ఇస్లామ్ను అభ్యర్థిగా ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలుండగా.. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా టీఎంసీ, భాజపా మధ్యే పోరు నెలకొంది. విపక్ష ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ.. రాష్ట్రంలో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ఇటీవల తృణమూల్ ప్రకటించింది. మొత్తం స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
ఐదేళ్లలో ఎస్సీల సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. -
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
జగన్ ఫొటోలు ఉన్న పాసు పుస్తకాల నకళ్ల దహనానికి తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. -
జనసేనకు వంగ లక్ష్మణ్గౌడ్ రాజీనామా
జనసేన తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం తాజ్కృష్ణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు