Odisha: డబుల్ ఇంజిన్ పాలనకే ఓటు
ఒడిశాలో నవీన్ శకానికి తెరపడింది. కమలం విరబూసింది. లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో భాజపా ఆధిక్యత సాధించింది. మోదీ గ్యారంటీని ఓటర్లు విశ్వసించారు.
ఒడిశాలో పనిచేసిన మోదీ మ్యాజిక్
కలిసొచ్చిన భాజపా హామీలు
బిజద కొంపముంచిన అవినీతి, పాండ్యన్ వైఖరి
భువనేశ్వర్, న్యూస్టుడే: ఒడిశాలో నవీన్ శకానికి తెరపడింది. కమలం విరబూసింది. లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో భాజపా ఆధిక్యత సాధించింది. మోదీ గ్యారంటీని ఓటర్లు విశ్వసించారు. లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సాధించింది. 25 ఏళ్ల బిజూ జనతాదళ్ (బిజద) పాలనకు మంగళం పాడారు.
ఒడిశాలో మోదీ మ్యాజిక్ పనిచేసింది. అభివృద్ధే తమ అజెండాగా పేర్కొన్న మోదీ మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రమంతటా పర్యటించి ప్రచారం చేశారు. ఖనిజ సంపదను వినియోగంలోకి తెస్తామని, పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో యువత విశ్వసించింది. అన్నదాతలకు న్యాయం చేస్తామని, నీటి పారుదల రంగానికి పెద్దపీట వేస్తామని, ధాన్యం మండీల్లో జరుగుతున్న అవినీతికి పాతరేసి క్వింటాలుకు రూ.3,100 మద్దతుధర (ఎంఎస్పీ) చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చి వారి ఓట్లు సొంతం చేసుకున్నారు.
శ్రీక్షేత్ర అస్త్రం గురి తప్పలేదు
భాజపా ప్రయోగించిన శ్రీక్షేత్ర అస్త్రం ఓటర్లను సూటిగా తాకింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తూర్పు తీరధామం పురీ జగన్నాథుడి సన్నిధిలో అవినీతి, అక్రమాలు, భక్తుల అసౌకర్యాలు ప్రసార సాధనాల్లో నిత్యం చర్చనీయాంశమయ్యాయి. రత్నభాండాగారం విషయంలో బిజద పాలకుల వైఖరి ప్రజల్లో అనుమానాలకు తావిచ్చింది. ఇది గమనించిన ప్రధాని శ్రీక్షేత్రంలో జరుగుతున్న అవకతవకలపై ఉక్కుపాదం మోపి అయోధ్య, కాశీ తరహా సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. దీన్ని నమ్మిన ప్రజలు ఆ పార్టీకి అండగా నిలిచారు.
హామీలను విశ్వసించారు
మహిళల కోసం ఒడిశాలో సుభద్ర పథకం అమలు చేస్తామని భాజపా మేనిఫెస్టోలో ప్రకటించింది. అతివలకు రూ.50 వేలు వోచర్ చెక్కులు ఇస్తామని, ఈ మొత్తాన్ని వారు తమ కుటుంబ సంక్షేమానికి వినియోగించుకోవచ్చని పేర్కొంది. పీఎం సూర్యఘర్ యోజన కింద ఉచిత విద్యుత్తు, ఎస్హెచ్జీ మహిళలను లక్షాధికారులను చేస్తామని, 25 లక్షల పేద కుటుంబాలకు పీఎంఏవై ఇల్లు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి తదితర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. బీఎస్కేవై స్థానంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం గురించి భాజపా నేతలు విపులంగా వివరించి అమలుపరుస్తామన్నారు.
చిట్ఫండ్ బాధితులకు భరోసా
రాష్ట్రంలో 20 లక్షల మంది చిట్ఫండ్ బాధితులున్నారు. వారికి న్యాయం చేస్తామన్న భాజపా.. 18 నెలల్లో చెల్లింపులు తథ్యమని, అక్రమాలకు పాల్పడిన వారికి కారాగారానికి తరలిస్తామని హామీ ఇచ్చింది. దీన్ని బాధితులు విశ్వసించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలంతా రాష్ట్రంలో ప్రచారం చేయడం ఇదే తొలిసారి. వారంతా బిజద 25 ఏళ్ల పాలనా వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా, భాజపా అధికారంలోకి వస్తే ఏం చేయనున్నది స్పష్టంగా చెప్పారు. ఓటర్లను విశ్వాసంలోకి తీసుకున్నారు. మోదీ ప్రచారం, ఆయన గ్యారంటీ.. రాష్ట్రంలో భాజపా విజయానికి బాటలు వేశాయని పరిశీలకులు విశ్లేషించారు.
పాండ్యన్ తీరుపై అసంతృప్తి
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నవీన్ ప్రజలకిచ్చిన హామీలోకి కొన్ని నిలుపుకోలేదు. తనకు విధేయునిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి వి.కార్తికేయ పాండ్యన్కు పాలనా బాధ్యతలు అప్పగించేశారు. తమిళనాడుకు చెందిన పాండ్యన్.. బిజద పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద దిక్కయ్యారు. పార్టీ నేతలు ముఖ్యమంత్రిని కలవనీయకుండా చేశారని, కోటరీ నిర్మించుకొని రాజ్యాంగేతర శక్తిగా అవతరించారన్న వ్యాఖ్యలు బిజద నేతల్లోనే వినిపిస్తోంది. పాండ్యన్ ఆధిపత్యాన్ని విపక్షాలు ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి. బిజద గెలిస్తే తమిళుడు పాలకుడు అవుతాడని కమలం నేతలు చేసిన ప్రచారం భాజపాకు కలిసొచ్చింది.
ఆస్తులు పెంచుకున్నారు
నవీన్ పాలనలో (అయిదోసారి) బిజద నేతలు భారీగా ఆస్తులు పెంచుకున్నారు. మరోవైపు యువత ఆశలు నెరవేరలేదు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా చెప్పుకోదగ్గ నియామకాలు లేవు. ఔట్సోర్స్ పేరిట నవీన్ ప్రభుత్వం విద్యావంతులను చిన్నచూపు చూసింది. ఎన్నికలకు ముందుగా స్వల్పస్థాయిలో పోస్టులు భర్తీ చేసినా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నది స్పష్టమైంది. గనులు, ఇసుక, బొగ్గు, నిర్మాణరంగాల్లో అవినీతి తారస్థాయికి చేరింది. కొవిడ్ విస్తరించిన తర్వాత సీఎం జనాలకు దూరమయ్యారు. చివరికి ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపికలోనూ అదే జరిగింది. పార్టీకి విధేయులుగా ఉన్న ఎంతో మందిని పక్కన పెట్టేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి