BJP: భాజపా పదో జాబితా విడుదల.. చండీగఢ్‌ నుంచి అనుపమ్‌ ఖేర్‌ సతీమణి ఔట్‌

తొమ్మిది లోక్‌సభ స్థానాలకు తాజాగా భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులను ప్రకటించింది. 

Updated : 10 Apr 2024 14:08 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల నిమిత్తం మరికొన్ని స్థానాలకు భాజపా (BJP) అభ్యర్థులను ప్రకటించింది. ఈ పదో జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. అసన్‌ సోల్ నుంచి ఎస్‌ఎస్‌ అహ్లూవాలియాను ఎంపిక చేసింది. అలాగే చండీగఢ్ సిట్టింగ్ ఎంపీ కిరణ్‌ ఖేర్‌ను తప్పించి.. ఆ స్థానంలో సంజయ్ టాండన్‌ను బరిలో నిలిపింది. కిరణ్ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్ సతీమణి. అలాగే మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు నీరజ్‌కు యూపీలోని బాలియా నుంచి టికెట్ దక్కింది. చండీగఢ్‌, అసన్‌సోల్‌తో సహా ఆ రాష్ట్రంలోని ఏడుస్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. 

తొలుత పశ్చిమ్ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి పవన్‌సింగ్‌ పేరును ప్రకటించింది. అయితే ఆయన పాటలు మహిళల్ని అసభ్యకరంగా చిత్రీకరించేలా ఉంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆయనే పోటీ నుంచి వైదొలిగారు.

  • మైన్‌పురి -జైవీర్‌ సింగ్ ఠాకూర్‌
  • కౌశాంబి -  వినోద్ సోంకర్‌
  • ఫుల్‌పుర్‌ - ప్రవీణ్‌ పటేల్‌
  • ప్రయాగ్‌రాజ్‌- నీరజ్‌ త్రిపాఠి
  • మచ్లీషహర్‌ - బీపీ సరోజ్‌
  • గాజీపుర్‌ - పరాస్‌ నాథ్‌ రాయ్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని