BJP: అతి త్వరలోనే వైకాపాను భాజపాకు సరెండర్‌ చేస్తారు: ఆదినారాయణ రెడ్డి

ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తగిన బుద్ధి చెప్పారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు.

Updated : 06 Jun 2024 15:35 IST

విజయవాడ: ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తగిన బుద్ధి చెప్పారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఓటమితో జగన్‌ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం పడింది. కేసుల భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అతి త్వరలోనే వైకాపాను జగన్‌.. భాజపాకు సరెండర్‌ చేస్తారు. వారంలోనే పులివెందులలో కూడా వైకాపా ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుంది. వివేకా హత్య కేసును త్వరగా తేల్చి దోషులకు శిక్ష పడేలా చేస్తాం. దిల్లీ మద్యం కేసులో భారతి ప్రమేయంపైనా విచారణ చేయిస్తాం’’ అని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని