NVSS Prabhakar: రాష్ట్ర సంపద తగ్గి.. మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయి: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో వారానికోసారి దిల్లీ వెళ్తున్నారని.. కప్పాన్ని తరలించేందుకే విమానాన్ని వినియోగిస్తున్నారని భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు.

Updated : 27 May 2024 15:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో వారానికోసారి దిల్లీ వెళ్తున్నారని.. కప్పాన్ని తరలించేందుకే విమానాన్ని వినియోగిస్తున్నారని భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. సీఎం విమానం దిల్లీకి వెళ్లే ముందు ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేయాలని డిమాండ్‌ చేశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో సంపద తగ్గి మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, సేకరణలో నాడు భారాస దోచుకుంటే.. నేడు అదే పంథాలో కాంగ్రెస్‌ నేతలు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖలపై వస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్‌ స్పందించాలని కోరారు. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని