Congress: సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన భాజపా నేతలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు భాజపా నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

Updated : 13 Apr 2024 15:19 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు భాజపా నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మక్తల్‌ భాజపా నేత జలంధర్‌రెడ్డితో పాటు సంగారెడ్డి ఇన్‌ఛార్జి పులిమామిడి రాజుకు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి, మంత్రి కొండా సురేఖ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని