BJP: తెలంగాణలో భాజపా లోక్‌సభ అభ్యర్థులు వీరే..

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భాజపా (BJP) విడుదల చేసింది. 

Updated : 02 Mar 2024 19:41 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భాజపా (BJP) విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకుగానూ పోటీదారుల పేర్లు ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మందిని అధిష్ఠానం ఎంపిక చేసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ స్థానాల్లో గెలుపొందగా.. అందులో ముగ్గురు సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించారు. ఆదిలాబాద్‌ నుంచి సోయం బాపూరావుకు తొలిజాబితాలో అవకాశం లభించలేదు.

  • సికింద్రాబాద్‌ - కిషన్‌రెడ్డి (కేంద్రమంత్రి)
  • కరీంనగర్‌ - బండి సంజయ్‌
  • నిజామాబాద్‌ : డి.అర్వింద్‌
  • చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
  • మల్కాజిగిరి - ఈటల రాజేందర్‌
  • జహీరాబాద్‌ - బీబీ పాటిల్‌
  • హైదరాబాద్‌ - మాధవీలత
  • నాగర్‌ కర్నూల్‌ - భరత్‌ ప్రసాద్‌
  • భువనగిరి - బూర నర్సయ్యగౌడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని