Maharashtra: అక్కడ అజిత్పవార్కు భాజపా మద్దతా.. ఇదేం విడ్డూరం!
లక్షద్వీప్ లోక్సభ స్థానంలో అజిత్ పవార్కు భాజపా మద్దతిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎన్సీపీ (శరద్పవార్) వర్గం ఎద్దేవా చేసింది.
ముంబయి: సార్వత్రిక ఎన్నికల ముంగిట మహరాష్ట్రలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అప్పటి ఎన్సీపీ అధినేత శరద్పవార్పై (Sharad Pawar) తిరుగుబావుటా ఎగురవేసిన ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే (Eknath Shinde), భాజపాతో చేతులు కలిపిన అజిత్ పవార్ను (Ajit Pawar) కమలదళం అపహాస్యం చేస్తోందని ఎన్సీపీ (శరద్పవార్) వర్గం ఎద్దేవా చేసింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో లక్షద్వీప్ స్థానంలో ఎన్సీపీ అభ్యర్థికి మద్దతిస్తామని భాజపా చెప్పడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి క్లైడే క్రాస్టో విమర్శించారు. అక్కడ అసలు ఉనికే లేని భాజపా ఎలా మద్దతిస్తుందని అన్నారు. లక్షద్వీప్లో ఎన్సీపీ (అజిత్పవార్) వర్గం విజయం సాధించేందుకు పూర్తి సహకారం అందిస్తామని భాజపా అధికార ప్రతినిధి వినోద్ తావ్డే చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు.
‘‘లక్షద్వీప్లో అజిత్ పవార్కు భాజపా మద్దతిస్తుందట. ఇది ఆయన్ను అపహాస్యం చేయడమే. 2019 లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఒంటరిగా బరిలోకి దిగిన భాజపాకి కేవలం 125 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ స్థానాన్ని ఎన్సీపీ అభ్యర్థి ఫైసల్ పీపీ కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్సీపీ (శరద్పవార్) వర్గంలో ఉన్నారు’’ అని క్లైడే పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన మహ్మద్ అహ్మదుల్లా సయీద్పై, ఫైసల్ 823 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 22,851 ఓట్లు వచ్చాయి. లక్షద్వీప్లోని ఏకైక లోక్సభ నియోజకవర్గానికి తొలివిడతలో ఏప్రిల్ 19న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని 57,594 మంది ఓటర్లు ఉండగా.. 55 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేశారు.
ఇటీవల ఎన్సీపీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్, తన వర్గం నేతలతో కలిసి అధ్యక్షుడు శరద్పవార్పై తిరుగుబావుటా ఎగురవేశారు. శివసేన, భాజపాతో కలిసి ప్రభుత్వంలో భాగమయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆ తర్వాతి కాలంలో ఆయన వర్గమే అసలైన ఎన్సీపీ అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును వారికే కేటాయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..