Kishan Reddy: వచ్చే ఐదేళ్లలో పేదలకు 3 కోట్ల ఇళ్లు : కిషన్రెడ్డి
రానున్న ఐదేళ్లలో పేదలకు కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో 3 కోట్ల ఇళ్లను మోదీ ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సంకల్ప పత్రాన్ని ఎంపీ లక్ష్మణ్తో కలిసి విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతి, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు.
దశాబ్దాల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. 2047 నాటికి వికసిత భారత్ పేరుతో భాజపా ముందుకెళ్తోందని, ఐదేళ్లలో దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ మోదీ పాలనలో నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. పేపర్ లీకేజీ అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చాం. పోస్టాఫీసులను మినీ బ్యాంకులుగా మార్చేస్తున్నాం. దేశాన్ని మిల్లెట్ హబ్గా మారుస్తాం. దేశ భవిష్యత్ కోసమే వన్ నేషన్.. వన్ ఎలక్షన్’’ అని కిషన్రెడ్డి తెలిపారు.
ఓట్ల కోసమే కాంగ్రెస్ ఉచితాలు: లక్ష్మణ్
కాంగ్రెస్ న్యాయపత్రాన్ని, అన్యాయ పత్రంగా ప్రజలు భావిస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. భాజపాది వికాస భారత్ నినాదమైతే.. కాంగ్రెస్ది విభజిత భారత్ నినాదమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముస్లింలీగ్ మాదిరిగానే ఉందన్నారు. ఓట్ల కోసమే ఉచితాలు, గ్యారంటీల పేరుతో మోసం చేస్తోందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?