WestBengal: దీదీ.. మీ గేమ్స్ మాకూ వచ్చు!..:భాజపా
పశ్చిమ్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరచూ వాడే ‘ ముందుంది అసలైన ఆట’ నినాదాన్ని ఈసారి భాజపా అందుకుంది. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలు ఆట ఆడతాయని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. బెంగాల్లో ఈసారి ముందస్తు ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.
కోల్కతా: పశ్చిమ్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరచూ వాడే ‘ ముందుంది అసలైన ఆట’ నినాదాన్ని ఈసారి భాజపా అందుకుంది. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలు ఆట ఆడతాయని, అయితే ఈ ఆట చాలా భయకంరంగా ఉంటుందని పశ్చిమ్బెంగాల్ భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్ వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రస్ ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలతోపాటే పశ్చిమ్బెంగాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశముందన్న ఆయన.. అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఉత్తర 24 పరగణాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో మజుందార్ మాట్లాడుతూ.. భాజపా హింసను ప్రోత్సహించబోదని అన్నారు. అలాగని తమ కార్యకర్తలపై దాడికి యత్నిస్తే మాత్రం చేతులు కట్టుకొని కూర్చునే పరిస్థితి లేదని తెలిపారు. రాష్ట్రంలో ఈసారి భాజపా ఆడబోయే ఆట.. తృణమూల్ కాంగ్రెస్కు దిమ్మదిరిగేలా చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులను మమతా బెనర్జీ ప్రభుత్వం కొల్లగొడుతోందని విమర్శించారు. ఇదే పరిస్థితి మరికొన్నేళ్ల పాటు కొనసాగితే..రాష్ట్రంలో ఇంకేం మిగలదని ఆయన అన్నారు.
2021లో వరుసగా మూడోసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, 2021 ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో దాదాపు 300 మంది తృణమూల్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్లు మజుందార్ గుర్తు చేశారు. దీనిపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోందని అన్నారు. బెనర్జీ ప్రభుత్వానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. వారంతా తటస్థంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు తృణమూల్ కాంగ్రెస్ జీతాలు చెల్లించడం లేదని, ప్రజలు కట్టిన పన్నులే జీతాలుగా అందుతున్నాయన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం