Mamata on BJP: 400 కాదు.. 200 సీట్లు దాటి చూపించండి: భాజపాపై మమత వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీకి 200 సీట్లు కూడా రావని మమత బెనర్జీ అన్నారు. బెంగాల్ ఎన్నికల సమయంలోనూ ఇలానే ఢాంబికాలే పలికారని చెప్పారు.
జల్పాయ్గురి (పశ్చిమ బెంగాల్): లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 200 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. మోదీవన్నీ అబద్ధపు గ్యారెంటీలేనంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని భాజపా కాలరాస్తోందని విమర్శించారు. జల్పాయ్ గురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో శనివారం పాల్గొన్న సందర్భంగా కేంద్రంపై ఆమె తనదైన శైలిలో నిప్పులు చెరిగారు.
ఉత్తర బెంగాల్కు కేంద్రం చేసిందేమీ లేదని మమత అన్నారు. మోదీవన్నీ తప్పుడు హామీలేనని, వాటి ఉచ్చులో పడొద్దని ఓటర్లకు హితవు పలికారు. ముందు రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు ఇచ్చి అప్పుడు గ్యారెంటీల గురించి మాట్లాడాలని సూచించారు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లలో మిత్రులతో కలిసి విజయం సాధించాలని భాజపా లక్ష్యంగా నిర్దేశించుకున్న వేళ మమత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘2021 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలానే అన్నారు. బెంగాల్లో 200 సీట్లలో గెలుస్తామని ప్రగల్బాలు పలికారు. 70 దగ్గర ఆగిపోయారు. అందులో 10 మంది ఇప్పటికే మా పార్టీలో చేరారు. ఇప్పుడు 400 సీట్లలో గెలుస్తామని ఢాంబికాలు పలుకుతున్నారు. ముందు 200 సీట్లు దాటి చూపించండి’’ అని మమత వ్యాఖ్యానించారు.
భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన, ఉపాధి హామీ నిధులను రాష్ట్రానికి విడుదల చేయకుండా బకాయి పెట్టిందన్నారు. తాము ఆదాయం రూపంలో రూ.6.80 లక్షల కోట్లు ఇస్తే.. కేంద్రం తమకు రూ.1.74 లక్షల కోట్లు బకాయి పెట్టిందన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడపాలని ప్రశ్నించారు. గుజరాత్, మహారాష్ట్ర, యూపీకి ఇచ్చిన లెక్కల్ని బయటకు తీయాలన్నారు. ‘‘మమ్మల్ని దొంగలు అనడం కాదు.. మీరే అసలు దొంగలు, దోపిడీదారులు, దేశంలో అతిపెద్ద మాఫియా’’ అంటూ మమత దుయ్యబట్టారు. దేశంలో కలిసి పనిచేస్తాం గానీ.. బెంగాల్లో మాత్రం కాంగ్రెస్, సీపీఎంతో కలిసేది లేదన్నారు. ఆ పార్టీలు భాజపాతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ