Vishnu Deo Sai: ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణస్వీకారం
ఛత్తీస్గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, సీఎంల సమక్షంలో ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు.
రాయ్పుర్: ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో భాజపా సర్కార్ కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ (Vishnu Deo Sai) ప్రమాణస్వీకారం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో, ఎమ్మెల్యే విజయ్ శర్మ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రాజకీయ అతిరథ మహారథుల సమక్షంలో విష్ణుదేవ్ సాయ్ (59) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
సర్పంచి నుంచి సీఎం వరకు..
1964 ఫిబ్రవరి 21న జన్మించిన విష్ణుదేవ్ సాయ్కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. సర్పంచిగా ప్రస్థానం ప్రారంభించి.. నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ప్రధాని మోదీ తొలి కేబినెట్లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 2020 నుంచి 2022 వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రంలో ఆదివాసీలు 32 శాతం. దీంతో సీఎం ఎంపికలో అధిష్ఠానం ఆయనవైపు మొగ్గు చూపింది. ఎమ్మెల్యేగా విష్ణుదేవ్ను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక ఆయనకు పెద్ద పదవి వచ్చేలా చూస్తామని అమిత్షా ఒక సభలో చెప్పడం ప్రస్తావనార్హం. సాయ్ తాత, పెదనాన్నలు కూడా పలు పదవులు నిర్వర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.