Telangana News: వైఎస్ షర్మిల ఫైటర్.. తగ్గేదేలే: బ్రదర్ అనిల్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వైఎస్ షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వైఎస్ షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైతెపా వాహనాలు ధ్వంసం చేసిన వారిపై మాత్రం కేసులు పెట్టలేదని, బాధితులపైనే పోలీసులు కేసులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు పెట్టిన కేసులపై న్యాయపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు. షర్మిల ఫైటర్.. తగ్గేదేలేదన్నారు. షర్మిలపై పెట్టిన సెక్షన్లలో ఒక్కటైనా పోలీసులు రుజువు చేస్తారా?అని అనిల్ ప్రశ్నించారు
మరో వైపు భారీ పోలీసు బందోబస్తు మధ్య వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పంజాగుట్ట పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. ప్రగతిభవన్ ముట్టడికి కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించారని, అధికారుల విధులకు ఆటంకం కలిగించారని షర్మిలతో పాటు మరో ఐదుగురు వైతెపా నాయకులపై పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్లోని ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం షర్మిలను నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు వద్ద అదనపు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత