39లో.. భారాసకు మూడుచోట్లే ఆధిక్యం
లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సాధించలేకపోయిన భారాసకు.. ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కేవలం మూడు చోట్ల మాత్రమే ఆధిక్యం దక్కింది.
లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన సెగ్మెంట్ల తీరిది
ఆ పార్టీ గెలుపొందిన 24 చోట్ల ఇప్పుడు భాజపాకు ఆధిక్యం
మరో 12 స్థానాల్లో కాంగ్రెస్ పైచేయి
కాంగ్రెస్ గెలిచిన 15 స్థానాల్లో భాజపాకు ఆధిక్యం
కంటోన్మెంట్లో క్రాస్ ఓటింగ్ సుస్పష్టం
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సాధించలేకపోయిన భారాసకు.. ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కేవలం మూడు చోట్ల మాత్రమే ఆధిక్యం దక్కింది. రాష్ట్రంలో గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన భారాస.. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే మెజార్టీని కనబరిచింది. ఆ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోయిన 36 స్థానాల్లో.. 24 చోట్ల భాజపా మెజార్టీని సొంతం చేసుకోగా.. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన 15 సెగ్మెంట్లలో ఈసారి భాజపా మెజారిటీ సాధించడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకుగాను.. 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో అవే సీట్లలో కాకపోయినా.. మొత్తంగా 64 స్థానాల్లో తన ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో నెగ్గిన భాజపా.. లోక్సభ ఎన్నికల్లో 46 సెగ్మెంట్లలో మెజారిటీ సాధించింది. భారాస మూడు స్థానాల్లో, ఎంఐఎం ఆరు స్థానాల్లో మెజారిటీలు సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక స్థానాల్లో భారాస సాధించిన భారీ ఆధిక్యాలు.. లోక్సభ ఎన్నికల్లో తగ్గాయి. గజ్వేల్లో భారాసకు అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 45 వేల ఓట్ల ఆధిక్యం రాగా.. ఈసారి 20 వేల మెజార్టీకి పరిమితమైంది. సిద్దిపేటలో ఆ పార్టీ మెజార్టీ 82 వేల ఓట్ల నుంచి 2800కి పడిపోయింది. దుబ్బాకలో ఆధిక్యం 44 వేల ఓట్ల నుంచి 16 వేలకు తగ్గింది. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం భాజపా ఖాతాలో ఉండగా.. లోక్సభ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్కు అత్యధిక ఓట్లు పడ్డాయి.
- శాసనసభ ఎన్నికల్లో.. కరీంనగర్, మహబూబ్నగర్ లోక్సభ స్థానాల పరిధిలోని అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించి గెలుపొందగా.. లోక్సభ ఎన్నికల్లో.. ఈ రెండు ఎంపీ స్థానాల పరిధిలోని అత్యధిక సెగ్మెంట్లలో భాజపాకే ఆధిక్యం దక్కింది.
- కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. తాజా లోక్సభ ఎన్నికల్లో కొత్తగూడెంలో కాంగ్రెస్కు 25 వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది.
- సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నాంపల్లిలో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపొందగా.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆధిక్యం వచ్చింది. ఈ లోక్సభ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేయలేదు.
కంటోన్మెంట్లో కమాల్
ఏకకాలంలో ఉప ఎన్నిక, లోక్సభ పోలింగ్ జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు ప్రత్యేకతను చాటుకున్నారు. ఉప ఎన్నికలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ను కాంగ్రెస్ దక్కించుకోగా.. ఇదే సెగ్మెంట్లో లోక్సభకు పోలైన ఓట్లలో మాత్రం భాజపాకు మెజారిటీ వచ్చింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్కు 53,651 ఓట్లు, భాజపాకు 40,445 ఓట్లు వచ్చాయి. అంటే 13,206 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక లోక్సభ పోలింగ్లో మాత్రం భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్కు 45,661 ఓట్లు పోలవగా.. భాజపాకు 64,133 ఓట్లు పడ్డాయి. దీంతో కమలానికి 18,472 ఓట్ల ఆధిక్యం లభించింది.
భారాస నుంచి భాజపాకు మెజారిటీ మారిన సెగ్మెంట్లు
బోథ్, కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్, కోరుట్ల, బాల్కొండ, పటాన్చెరు, శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, గద్వాల, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఖైరతాబాద్, సనత్నగర్, అంబర్పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్.
భారాస నుంచి కాంగ్రెస్కు మెజారిటీ మారినవి..
ఆసిఫాబాద్, జగిత్యాల, జహీరాబాద్, బాన్సువాడ, నర్సాపూర్, సంగారెడ్డి, అలంపూర్, జూబ్లీహిల్స్, సూర్యాపేట, స్టేషన్ఘన్పూర్, జనగామ, భద్రాచలం.
కాంగ్రెస్ నుంచి భాజపాకు మెజారిటీ మారిన స్థానాలు..
ఖానాపూర్, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, మెదక్, పరిగి, తాండూరు, మహబూబ్నగర్, నారాయణపేట, దేవరకద్ర, మక్తల్, వరంగల్ ఈస్ట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
29న దిల్లీ జంతర్మంతర్లో మహిళా ధర్నా
మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందినా మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళలను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.