Kishan Reddy: రాహుల్‌ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాలేరు: కిషన్‌రెడ్డి

రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణలో గ్యారంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి  ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. 

Published : 24 Mar 2024 18:08 IST

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భాజపా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ కలవాలని సూచించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ ముఖ్యనేతలు సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ చుగ్‌, లక్ష్మణ్‌, డీకే అరుణ, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో భాజపాకు సానుకూల వాతావరణం ఉందన్నారు.‘‘ రాష్ట్రంలో భాజపాకు రెండంకెల సీట్లు వస్తాయి. పోలింగ్‌ బూత్‌ వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. రాహుల్‌ ప్రధాని అయితేనే గ్యారంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. రాహుల్‌ ఈ జన్మలో ప్రధాని కాలేరు. గ్యారంటీలు అమలు చేయకుండా రేవంత్‌ మోసం చేస్తున్నారు’’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని