BJP: ఆ సీఎం ఓ కీలుబొమ్మ.. అధికారం కల్పన చేతుల్లోనే: భాజపా నేత ఆరోపణలు
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ ఓ కీలుబొమ్మ అని, మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పన అధికార కేంద్రంగా ఉన్నారని భాజపా ఆరోపించింది.
జంషెడ్పుర్: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్పై భాజపా సీనియర్ నేత అమర్ కుమార్ బౌరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఆపద్ధర్మ, ఓ కీలుబొమ్మ సీఎం అన్నారు. మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పన అధికార కేంద్రంగా మారారంటూ ఆరోపించారు. ఝార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న బౌరి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం, జేఎంఎం పార్టీలో లేని కల్పనా సోరెన్ ఏ హోదాలో సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. సీఎంగా ఉన్నప్పటికీ చంపాయ్ సోరెన్ ఎందుకు నిస్సహాయుడిలా ఉంటున్నారో ఆయన్ను అడగాలనుకుంటున్నా. లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఆయనకు జేఎంఎం ఎందుకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదు?’ అని విమర్శించారు. కల్పనా సోరెన్ రాజకీయ జోక్యం వారసత్వ రాజకీయాలకు ఉదాహరణగా నిలుస్తోందన్నారు. ఆమె ఝార్ఖండ్లో అధికార కేంద్రంగా మారారన్న ఆయన.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అధికారాన్ని సోనియా గాంధీ చెలాయించిన చందంగానే కూడా ఇప్పుడు అదే తరహాలో వ్యవహరిస్తున్నారు’’ అని ఆరోపించారు.
ఝార్ఖండ్లో విపక్ష ‘ఇండియా’ కూటమి మొత్తం 14 సీట్లు గెలుచుకుంటుందన్న చంపాయ్ వ్యాఖ్యలపై స్పందించిన బౌరి.. ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారన్నారు. జంషెడ్పుర్లో ఆ కూటమి తరఫున అభ్యర్థిని బరిలో నిలబెట్టడమే కష్టంగా ఉందని.. అలాంటిది 14 స్థానాలు ఎలా గెలుచుకోగలరంటూ ప్రశ్నించారు. సీఎం ప్రకటన ఆ కూటమిలో నిరాశకు అద్దంపడుతోందన్నారు. ‘ఇండియా’ కూటమికి ప్రచారకర్తగా ఉండాల్సిన సీఎం.. శనివారం నుంచి మూడు రోజుల పర్యటనలో భాగంగా కూటమి తరఫున జంషెడ్పూర్లో అభ్యర్థిని పెట్టడమే కష్టంగా మారిందని ఎద్దేవా చేశారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరిలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి ఆయన సతీమణి కల్పన సోరెన్ బయటకు వచ్చి క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ చురుగ్గా పనిచేస్తున్నారు. ఇటీవల ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ ప్రసంగించి ప్రత్యేకంగా నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా