Chandra babu: దక్షిణాది వాణిని చంద్రబాబు బలంగా వినిపిస్తారని భావిస్తున్నా

కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తెదేపా అధినేత, ఎన్డీయే నాయకుడు చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు.

Published : 06 Jun 2024 04:08 IST

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

చంద్రబాబు నాయుడిని అభినందిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌

చెన్నై: కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తెదేపా అధినేత, ఎన్డీయే నాయకుడు చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల వాణిని ఆయన బలంగా వినిపిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్డీయే సమావేశం కోసం చంద్రబాబు, ఇండియా కూటమి సమావేశానికి స్టాలిన్‌ బుధవారం దిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో చంద్రబాబును కలుసుకున్నట్లు ఎక్స్‌లో స్టాలిన్‌ పోస్ట్‌ చేశారు. ‘కరుణానిధికి దీర్ఘ కాల స్నేహితుడైన చంద్రబాబును దిల్లీ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నా. ఏపీలో ఆయన సాధించిన విజయానికి అభినందనలు తెలిపి, ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశా’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని