Chandrababu: ఆ అరెస్టు.. వైకాపాకు మరణశాసనం
అధికారం అండ చూసుకుని పేట్రేగిపోయిన జగన్ పతనం.. తెదేపా అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసినప్పుడే ఖాయమైంది. ఆ అక్రమ అరెస్టే వైకాపా ప్రభుత్వానికి మరణశాసనం రాసేసింది.
ఈనాడు, అమరావతి: అధికారం అండ చూసుకుని పేట్రేగిపోయిన జగన్ పతనం.. తెదేపా అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసినప్పుడే ఖాయమైంది. ఆ అక్రమ అరెస్టే వైకాపా ప్రభుత్వానికి మరణశాసనం రాసేసింది. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ఊరూవాడా వెల్లువెత్తిన నిరసన మహోగ్రరూపం దాల్చి, వైకాపా సర్కారును కూల్చేసింది. ఆయనకు మద్దతుగా కట్టలు తెంచుకున్న ప్రజాభిమానం, వెల్లువెత్తిన సానుభూతి వేల ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థుల్ని మట్టికరిపించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన అభిమానులు కదం తొక్కారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో సంఘీభావంగా ప్రదర్శనలు, ర్యాలీలు, సభలు నిర్వహించారు. ఆయన విడుదల కోసం ఊరూవాడా ప్రార్థనలు చేసింది. రూ.వేల కోట్ల అవినీతి, అక్రమ సంపాదన కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు మకిలి అంటించేందుకు విశ్వప్రయత్నం చేశారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును 2023 సెప్టెంబరు 9న ఉదయం 6 గంటలకు డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అత్యంత అవమానకర రీతిలో అరెస్టు చేశారు. రోడ్డు మార్గంలో ఆయన్ను విజయవాడ తరలించారు. విషయం తెలిసి తెదేపా కార్యకర్తలు భారీగా రోడ్లపైకి వచ్చారు. తమ అధినేతను కాన్వాయ్లో తీసుకెళుతున్న పోలీసుల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి 52 రోజుల అనంతరం ఆయన విడుదలయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, సంఘీభావ ర్యాలీలు కొనసాగాయి. ఆయన అరెస్టుతో కలత చెంది పలువురు మరణించారు. వారి కుటుంబసభ్యులందర్నీ.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో పరామర్శించి, అండగా నిలిచారు.
అసాధారణ రీతిలో మహిళల మద్దతు
ఎప్పుడూ ఇంట్లోంచి బయటకు రాని మహిళలు కూడా చంద్రబాబు అరెస్టుకు చలించి.. రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో, గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో అసాధారణ రీతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసుల కళ్లుగప్పేందుకు సినిమాకో, షాపింగ్కో వెళుతున్నట్టుగా బయటకు వచ్చి, అందరూ అనుకున్న సమయానికి విజయవాడ బెంజ్ సర్కిల్ వద్దకు చేరుకుని కదం తొక్కారు. అటు గుంటూరులోనూ గుజ్జనగుండ్ల నుంచి లాడ్జ్ సెంటర్ వరకు వేల సంఖ్యలో మహిళలు కొన్ని కిలోమీటర్ల దూరం నిర్వహించిన ప్రదర్శన నభూతో. పోలీసుల ఆంక్షల్ని, నిర్బంధాల్ని అధిగమించి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. విజయవాడ, గుంటూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రదర్శనలే జగన్ పతనానికి స్పష్టమైన సంకేతాలు పంపాయి. చంద్రబాబు విడుదల కావాలంటూ శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలంలోని మారుమూల గెడ్డకంచరాం గ్రామంలోనూ 2వేల మంది మహిళలు ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతకు పూజలు చేయడం వెల్లువెత్తిన ప్రజాభిమానానికి నిదర్శనం. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని.. లక్షల సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేయడానికి అప్పట్లో ఆయనపై వెల్లువెత్తిన సానుభూతే ప్రధాన కారణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.