Chandrababu: అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతే: చంద్రబాబు

రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ధర్మం వారివైపే ఉందని.. అమరావతే గెలుస్తుందని చెప్పారు.

Published : 31 Mar 2023 13:38 IST

అమరావతి: రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ధర్మం వారివైపే ఉందని.. అమరావతే గెలుస్తుందని చెప్పారు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. రైతుల పోరాట స్ఫూర్తిని చంద్రబాబు అభినందించారు. అమరావతి ఉద్యమం వైకాపా ప్రభుత్వ ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి ముందుకు సాగుతోందన్నారు. అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతేనని ఆయన పేర్కొన్నారు. 

కియాపై జగన్‌ ఇప్పుడేం చెబుతారు?

కియా పరిశ్రమపై గతంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను మరో ట్వీట్‌లో చంద్రబాబు ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కియాను తరిమేస్తానంటూ ప్రతిపక్ష నేతగా జగన్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. కియాపై నాడు జగన్‌ చేసిన వ్యాఖ్యలు.. తాజాగా లోకేశ్‌ సెల్ఫీ ఛాలెంజ్‌లను ప్రస్తావిస్తూ వీడియోలను చంద్రబాబు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కెన్‌యూ ఆన్సర్‌ మిస్టర్‌ జగన్‌? అని ఆయన ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు