Chandrababu: ఉద్యోగాల భర్తీపై వైకాపా ఎప్పుడైనా శ్రద్ధ పెట్టిందా?: చంద్రబాబు
వైకాపాలో తిరుగుబాటు మొదలైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు.
రాజమహేంద్రవరం: వైకాపాలో తిరుగుబాటు మొదలైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ ఎన్నికలు అయిపోగానే వైకాపా ఖాళీ అవుతుంది. నడిరోడ్డుపై మహిళలను ఆ పార్టీ నేతలు వేధిస్తున్నారు. వారి జోలికి వస్తే వైకాపాకి అదే చివరి రోజవుతుంది. ప్రజల కోసం వారి మాటలు భరిస్తున్నాం. మాచర్లలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారు. ఉన్మాది పాలనలో అందరం బాధితులమే’’ అని చంద్రబాబు అన్నారు.
వైకాపాను గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఐదేళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. ‘‘ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నారు. ఆకు కూరలు దొరకడం లేదు గానీ, రాష్ట్రమంతా గంజాయి దొరుకుతోంది. దానికి బానిసల్ని చేసి యువత భవిష్యత్ను నాశనం చేస్తున్నారు. సంస్కరణలకు నాందిపలికిన పార్టీ తెదేపా. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చాం. వైకాపా ప్రభుత్వంలో 9 సార్లు ఛార్జీలు పెంచారు. పన్నుల బాదుడుతో పేదల రక్తాన్ని తాగుతున్నారు’’ అని విమర్శించారు.
‘‘జగన్ చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ సైకో పనులు. దళితులెవరూ నోరెత్తకూడదు. ప్రశ్నించకూడదు. వారు స్వరం వినిపిస్తే గొంతు నొక్కేస్తారు, చంపేస్తారు. నాలుగున్నరేళ్లలో 6వేల దాడులు చేశారు. 188 మందిని పొట్టన పెట్టుకున్నారు. మాస్క్ అడిగిన సుధాకర్ను పిచ్చోణ్ని చేసి చంపారు. బాబాయిని చంపిన అవినాష్రెడ్డి మాత్రం రోడ్డుపై తిరుగుతున్నారు. కోడికత్తి శ్రీను ఐదేళ్ల నుంచి జైలులో ఉన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ఆ పార్టీని భూస్థాపితం చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!