Chandrababu: జగన్ చెప్పేవి అబద్ధాలు.. చేసేవి మోసాలు: చంద్రబాబు
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.
రాజాం: ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సలహాదారుల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ఇచ్చే డబ్బుతో ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తారకరామతీర్థ సాగర్కు రూ.280 కోట్లు, తోటపల్లి ప్రాజెక్టుకు రూ.237 కోట్లు, వంశధార ఫేజ్-2కు రూ.420 కోట్లు, నాగావళి-వంశధార లింక్కు రూ.145 కోట్లు ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలనీ, చేసేవన్నీ మోసాలని ధ్వజమెత్తారు.
తెదేపా అధికారంలో ఉంటే 2020లోనే భోగాపురం విమానాశ్రయం పూర్తయి ఉండేదన్నారు. ఏడాదిన్నరలోగా ఎయిర్పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఎయిర్పోర్టు నిర్మాణానికి సేకరించిన భూముల్లో గొడవ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ గిరిజన వర్సిటీ విషయంలోనూ రివర్స్ టెండరింగ్ చేశారు. మా హయాంలో భావనపాడు పోర్టుకు టెండర్లు పిలిచా. మేం చేపట్టిన పనులు కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి చెందేది. విశాఖలో వైకాపా నేతలు భూ కబ్జాలు చేశారు. మేం విశాఖను వాణిజ్య రాజధాని చేశాం. కానీ, వైకాపా ప్రభుత్వం విశాఖను గంజాయి, డ్రగ్స్కు రాజధాని చేసింది. ఇక్కడికి అదానీ డేటా సెంటర్, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెచ్చాను. ఎంతో కష్టపడి మెడ్టెక్ పార్కు తెచ్చా. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ తరిమేసింది. ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందో ప్రజలు బేరీజు వేసుకోవాలి. జగన్కు విశాఖ నగరంపై ప్రేమ లేదు.. ఆస్తుల మీదే ప్రేమ. విశాఖలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
పేద ప్రజల బాగు కోసమే నా ఆవేదన. నా బాధ. జగన్ వచ్చాక ఎస్సీలు, ఎస్టీలకు అన్యాయం జరిగింది. నాపై తప్పుడు కేసులు పెట్టారు.. వేధించారు. రాళ్ల దాడి కూడా చేస్తున్నారు. నేను అరెస్టయ్యాననే బెంగతో 203 మంది ప్రాణాలు వదిలారు. ఆ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి ధైర్యం చెప్పారు. ప్రజల కోసం పని చేస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్. మోదీ మూడోసారి ప్రధాని అవుతారు. అందరం కలిసి రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాం. నా అనుభవం ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. సంపద సృష్టించాలి.. వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. వైకాపా పాలనలో ప్రజల ఆదాయం తగ్గింది. ఖర్చులు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ వేస్తా. డ్వాక్రా సంఘాల మహిళలను లక్షాధికారులను చేస్తా’’ అని చంద్రబాబు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్