Chandrababu: బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
ఎస్సీలను హింసించి శిరోముండనం చేసిన వ్యక్తిని జగన్ ఎమ్మెల్యేను చేస్తానంటున్నాడని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
మచిలీపట్నం: ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానిలు ఉన్నారు.. ఒకరు బూతుల నాని.. మరొకరు నీతుల నాని అని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. మమ్మల్ని తిట్టడమే వారు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజాగళంలో భాగంగా చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్తో కలిసి బందరులో రోడ్ షో నిర్వహించారు. ఇరు పార్టీల అధినేతల రాకతో బందరు కోనేరు సెంటరు కదం తొక్కింది. రోడ్ షోకు కూటమి శ్రేణులు భారీగా తరలివచ్చారు. యువత బైక్ ర్యాలీలతో బందరు రహదారులు కిక్కిరిసి పోయాయి. మహిళలు రహదారికి ఇరువైపులా బారులు తీరి నేతలకు అభివాదం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్సీలను హింసించి శిరోముండనం చేసిన వ్యక్తిని జగన్ ఎమ్మెల్యేను చేస్తానంటున్నాడని మండిపడ్డారు. బందరుకు ఏం చేశావో చెప్పే ధైర్యం నీతుల పేర్ని నానికి ఉందా అని సవాల్ విసిరారు. ఎన్ని నిధులు తెచ్చాడో తెలీదు కానీ, ముడుపులు మాత్రం బాగా తీసుకుంటాడని ఆరోపించారు. నీతుల నాని పోయాడు.. బుల్లికిట్టు వచ్చాడని ఎద్దేవా చేశారు. గంజాయి బ్యాచ్ను నిర్వహించేది కిట్టూనే అని దుయ్యబట్టారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ కాదు.. టాప్-10 చేపడతామని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక.. భోగరాజు పట్టాభి మెమోరియల్కు ఎన్వోసీ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు నిలిచి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం బాగుకోసం అందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ అని తెలిపారు. ఎంతో మంది విమర్శలు చేసినా అదరక బెదరక ధైర్యంగా నిలబడిన వ్యక్తి పవన్ అని చంద్రబాబు కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై