Kharge: చైనా మన భూభాగాలను ఆక్రమిస్తే మౌనంగా మోదీ

భారత్‌లోని భూభాగాలను చైనా ఆక్రమించడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఆ దేశం మన భూములను ఆక్రమించి ఇళ్లు, రోడ్లు నిర్మిస్తున్నా ప్రధాని  మౌనంగా ఉన్నారని ఆక్షేపించారు. 56 అంగుళాల ఛాతీ ఎక్కడ అని ప్రశ్నించారు.

Published : 26 May 2024 04:03 IST

ప్రధాని 56 అంగుళాల ఛాతీ ఎక్కడ: ఖర్గే

శిమ్లా: భారత్‌లోని భూభాగాలను చైనా ఆక్రమించడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఆ దేశం మన భూములను ఆక్రమించి ఇళ్లు, రోడ్లు నిర్మిస్తున్నా ప్రధాని  మౌనంగా ఉన్నారని ఆక్షేపించారు. 56 అంగుళాల ఛాతీ ఎక్కడ అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే.. మోదీపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడకపోతే దాని ద్వారా అందిన ప్రజాస్వామ్యం, హక్కులు హరించుకుపోతాయని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం ధనికులకే మద్దతిస్తుండగా, కాంగ్రెస్‌ పేదల పక్షాన ఉందన్నారు. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దేశంలో మౌలిక సదుపాయాలను కల్పించారని, అవి పేదలను ఆదుకున్నాయని తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ పాలించిన 55 ఏళ్ల కాలంనాటి లెక్కలను మోదీ అడుగుతున్నారు. ప్రతి రూపాయి ఖర్చును మేం వివరిస్తాం. దాని కంటే ముందు తన పాలన కాలంలో లెక్కలను మోదీ బహిరంగ పరచాలి’’ అని ఖర్గే డిమాండ్‌ చేశారు.  ‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు