Rahul Gandhil: చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోంది: రాహుల్ గాంధీ
Rahul Gandhi on china: మన దేశంపై చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే.. మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
జయపుర: పొరుగు దేశం చైనా (China) మనపై యుద్ధానికి సిద్ధమవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం (Modi govt) నిద్రపోతోందని ఆరోపించారు. అసలు ముప్పేలేనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇదే విషయాన్ని తాను గడిచిన రెండేళ్లుగా చెబుతున్నానని తెలిపారు. ఇటీవల అరుణాచల్ప్రదేశ్లో తవాంగ్ సెక్టార్ వద్ద ఇరు దేశాల సైనికుల ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. ఆయన చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ (Bharat Jodo Yatra) వంద రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో రాజస్థాన్లో విలేకరులతో మాట్లాడారు.
‘‘చైనా నుంచి ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. వారు చొరబాటు కోసం కాదు.. యుద్ధం కోసం సన్నద్ధమవుతున్నారు. ఇదే విషయాన్ని రెండుమూడేళ్లుగా చెబుతున్నా. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ఈ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి విషయాల్లో పట్టీపట్టనట్లు వ్యవహరించడం తగదు. అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్లో వారు ప్రమాదకరంగా సన్నాహాలు చేసుకుంటూ ఉంటే.. మన ప్రభుత్వం నిద్రపోతోంది’’ అని విమర్శించారు. చైనా విషయంలో ఎవరి మాటా వినకూడదని ఈ ప్రభుత్వం అనుకుంటోందన్నారు. చైనా ఉపయోగిస్తున్న ఆయుధ సంపత్తి, వారు చేస్తున్నది చూస్తుంటే యుద్ధానికి సన్నద్ధమవుతున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. మన ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని దాస్తోంది అని రాహుల్ గాంధీ అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేయడం లేదని విమర్శించారు.
భాజపాను ఓడించేది మేమే
భారతీయ జనతా పార్టీని గద్దె దించేది కాంగ్రెస్ పార్టీనేనని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పనైపోయిందని చాలా మంది ఊహించుకుంటున్నారని, కానీ, భాజపాను ఓడించేది తామేనన్న విషయాన్ని నోట్ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారని, వారిని సమర్థంగా వినియోగించుకుంటే రాజస్థాన్లో మరోసారి కాంగ్రెస్ పార్టీదే గెలుపని విశ్వాసం వ్యక్తంచేశారు. భాజపాపై పోరాడే సత్తా లేనివారు పార్టీని వీడాలని మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీపై విశ్వాసం ఉన్నవాళ్లు మాత్రమే ఉండాలని సూచించారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు రాజస్థాన్ సహా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. పార్టీ కార్యకర్తలే కాదు.. ప్రజలు సైతం ఆదరిస్తున్నారని చెప్పారు.
ఆప్ లేకుంటే..
గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసిందని రాహుల్ గాంధీ అన్నారు. ఒకవేళ ఆప్ పోటీలో లేకపోయి ఉంటే భాజపాను కాంగ్రెస్ పార్టీ ఓడించి ఉండేదని చెప్పారు. ఆప్ భాజపాకు బీటీమ్ అని, తమ పార్టీని దెబ్బతీయడానికి భాజపాతో ఆ పార్టీ కుమ్మక్కైందని రాహుల్ విమర్శించారు.
భాజపా కౌంటర్..
చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మన ప్రభుత్వం నిద్రపోతోందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై భాజపా స్పందించింది. రాహుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘‘చైనా నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ డబ్బులు తీసుకుంది. ఇదొక అవినీతి. నెహ్రూ, కాంగ్రెస్ హయాంలో మన భూమి ఎలా చైనా చేతుల్లోకి వెళ్లిందో అందరికీ తెలుసు. అయినా, రాహుల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి
వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
వైకాపాను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు
రాష్ట్రంలో మాదిగలు బాగు పడాలంటే వైయస్ జగన్ను ఓడించి... ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
రెండోరోజు 367 నామినేషన్లు దాఖలు
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
అనకాపల్లి జిల్లాకు చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాకు చేరుకుంది. కాకినాడ జిల్లా తుని మీదుగా పర్యటిస్తూ వచ్చిన ఆయన రాత్రి తొమ్మిది గంటలకు పాయకరావుపేట చేరుకున్నారు. -
కేసీఆర్.. లెక్కపెట్టుకోండి
కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని.. భారాసలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్ ప్రతిరోజూ సాయంత్రం లెక్కపెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
భారాస, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే
‘తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్వే లాంటిది. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. భారాస.. ప్రజల సొమ్మును లూటీ చేసింది. -
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
కుప్పంలో చంద్రబాబు నామినేషన్
కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి పాశుపతాస్త్రం
తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి నిప్పుల ఉప్పెన, అగ్నిపర్వత విస్ఫోటం అని.. ఆ పాశుపతాస్త్రాన్ని తట్టుకొనే శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నామినేషన్
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
తొలిదశ పోలింగ్ 62.37%
దేశంలో 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది. -
అధికార దాహం తీరకే శాపనార్థాలు
రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన భారాస నేతలు ఇంకా అధికార దాహం తీరక ఈ ప్రభుత్వం కొనసాగదు, కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
22 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్రాజ్కు వినతిపత్రం సమర్పించారు. -
రెండో రోజు 57 నామినేషన్లు
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది. -
దిల్లీ కాంగ్రెస్.. గల్లీ కాంగ్రెస్ వేర్వేరు
దిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాజపాకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు?
ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)