Janasena: పవన్‌ కల్యాణ్‌ను కలిసిన చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే

చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు.

Published : 03 Mar 2024 16:42 IST

హైదరాబాద్‌: చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. చిత్తూరు అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా ఇటీవల విజయానందరెడ్డిని వైకాపా అధిష్ఠానం నియమించింది. దీంతో అసంతృప్తిగా ఉన్న శ్రీనివాసులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్‌తో సమావేశమై చర్చించారు. త్వరలో జనసేనలో చేరనున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు