Revanth Reddy: దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి పయనమయ్యారు. శనివారం దిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

Published : 07 Jun 2024 17:58 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి పయనమయ్యారు. శనివారం దిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం కాంగ్రెస్‌ పెద్దలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక తదితర విషయాలపై చర్చిస్తారని సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వంశీచంద్‌రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ హాజరు కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు