దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్రపై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్ట్ టైమ్ రాజకీయ నాయకులు రావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్రావు రచించిన ‘గవర్నర్పేట్ టు గవర్నర్ హౌస్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.
దిల్లీకి వెళ్తే ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి..
‘‘జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తోంది. ఇది అందరం నిశితంగా గమనించాల్సిన అంశం. నాడు సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించారు. ఇది తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. ఆ తరం తర్వాత మళ్లీ జైపాల్రెడ్డి, వెంకయ్యనాయుడు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా దిల్లీకి వెళ్తే .. ఎవరిని కలవాలో, ఎవరు మనవాళ్లు ఉన్నారో తెలియని పరిస్థితి. మన ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించాలన్నా మాట్లాడే నేతలే కనిపించడంలేదు.
తెలుగు వారు మళ్లీ సత్తా చాటాలి..
రాను రాను.. ఇది మన గుర్తింపు, గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమో. ఫుల్ టైమ్ రాజకీయ నేతలు లేకపోవడమో.. పార్ట్టైమ్ పాలిటిక్స్, ఫుల్టైమ్ బిజినెస్ చేసే వాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల జరుగుతుందో తెలియదు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు మన గుర్తింపునకు, దేశ రాజకీయాల్లో తెలుగు భాషకు, ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏ మాత్రం ప్రయోజనకరం కాదు. ఈ పరిణామాలను మేధావులు ప్రస్తావించాలి. మళ్లీ తెలుగువారంతా కలిసి రాణించాల్సిన అవసరముంది. కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న 5 ట్రిలియన్ ఎకానమీలో తెలుగువారి పాత్ర ఎలా ఉండాలి. దేశ రాజకీయాల్లో మన నిర్ణయం, ప్రభావం ఉండాలి.
అధికారిక నిర్ణయాల్లో మన భాగస్వామ్యం ఉండాలి..
దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. జాతీయ స్థాయిలో మన భాష రెండో స్థానంలో ఉన్నప్పుడు.. రాజకీయాల్లో కూడా అదే విధంగా ప్రభావం చూపించాలి. అధికారిక నిర్ణయాల్లో మనం భాగస్వాములుగా ఉండాలి. గతంలో రాష్ట్రపతి పదవి ఉత్తర భారత దేశానికి ఇస్తే.. ప్రధాన మంత్రి పదవి దక్షిణాదికి ఉండేది. ఎప్పుడూ సమతూకం పాటించే వారు. కీలకమైన మొదటి అయిదు శాఖల్లో మూడింటికి కచ్చితంగా దక్షిణాది నుంచి ప్రాతినిథ్యం వహించే వారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం, పరిష్కారాలపై అనుభవజ్ఞులు ఆలోచన చేయాల్సిన అవసరముంది.
రాష్ట్రాలుగా విడిపోయినా.. కలిసి ముందుకెళ్దాం
జాతీయ విషయాలు వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచన చేయాలి, ప్రాంతీయ అంశాలు వచ్చినప్పుడు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే విచక్షణ ఉండాలి. పీవీ నరసింహారావుకు దేశ ప్రధానిగా అవకాశం వచ్చినప్పుడు నంద్యాలలో పోటీ చేస్తే.. ఆ నాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ పోటీ పెట్టలేదు. ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించారు. మంచి సంప్రదాయాలను పాటించేందుకు, గౌరవించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగువారిగా కలిసి ఉందాం. అభివృద్ధిని మన ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉంది. అనుభవజ్ఞులైన అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?