Revanth Reddy: రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి

ఏపీలో ఘన విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.

Published : 07 Jun 2024 06:24 IST

చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌
ఘనవిజయం సాధించినందుకు అభినందనలు

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలో ఘన విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష జరిగింది. ఇదే సమావేశం నుంచి రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని రేవంత్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని