Revanth Reddy: భారాస ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం వ్యవహరించాలి
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకున్న భారాస.. లోక్సభ ఎన్నికల్లో మూడు శాసనసభ సెగ్మెంట్లలోనే ఆధిక్యం కనబరిచింది. భారాసను అంతర్ధానం చేసి.. భాజపాను గెలిపించేందుకు కేసీఆర్ తమ పార్టీ ఓట్లు బదలాయించారు.
వారి ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టిన కేసీఆర్ కుటుంబం
‘గులాబీ’ ఓట్లను కమలదళానికి బదలాయించారు
మోదీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు
రాష్ట్రంలో పార్టీ జయాపజయాలకు నాదే బాధ్యత
డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు
సీఎం రేవంత్రెడ్డి వెల్లడి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్
ఈనాడు, హైదరాబాద్: ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకున్న భారాస.. లోక్సభ ఎన్నికల్లో మూడు శాసనసభ సెగ్మెంట్లలోనే ఆధిక్యం కనబరిచింది. భారాసను అంతర్ధానం చేసి.. భాజపాను గెలిపించేందుకు కేసీఆర్ తమ పార్టీ ఓట్లు బదలాయించారు. భారాస ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు భాజపాకు తాకట్టు పెట్టి.. ఆ పార్టీతో బేరసారాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా భారాస శాసనసభ్యులు తమ ఆత్మప్రబోధానుసారం వ్యవహరించాలి’’ అని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. భారాసకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారని, ఇంత దుర్భర పరిస్థితి దాపురించిందంటే.. కేసీఆర్ నాయకత్వాన్ని, ఆయన కుటుంబాన్ని తెలంగాణ సమాజం ఎంతగా తిరస్కరిస్తోందో వారు ఆలోచించాలన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎంపీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు కడియం కావ్య, మల్లు రవి తదితరులతో కలిసి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘మేం అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే మాపై అనేక ఆరోపణలు చేసిన భారాసకు తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో సున్నా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రపూరితంగా వ్యవహరించినందుకు ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన వ్యవహార శైలి మార్చుకోవాలి. ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు ఇవ్వాలి. కుటుంబ స్వార్థం కోసం, పార్టీ మనుగడ కోసం, అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ను దెబ్బతీయాలనుకుంటే.. రాష్ట్రంలో, కేంద్రంలో చట్టసభల్లో కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతారు’’ అని హెచ్చరించారు.
మా వంద రోజుల పాలనపై ప్రజల్లో విశ్వాసం
‘‘శాసనసభ ఎన్నికల్లో 64 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని, ఒకచోట మిత్రపక్షమైన సీపీఐని ప్రజలు గెలిపించారు. 39.5 శాతం ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజా పాలనకు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్లోని 5 హామీలను అమలు చేసి.. భవిష్యత్ కార్యాచరణను వివరించి.. లోక్సభ ఎన్నికల బరిలో దిగాం. ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరండమని విస్పష్టంగా చెప్పాం. మేమిచ్చిన గ్యారంటీలు, మా పాలన నచ్చితే.. మరింత బలం చేకూర్చేలా తీర్పు ఇవ్వాలని కోరాం. చాలామంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు రెఫరండం అనడం సరైంది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ, ప్రజల పట్ల ఉన్న విశ్వాసం, పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల ఉన్న నమ్మకంతో లోక్సభ ఎన్నికలు మా పరిపాలనకు రెఫరండమే అని పునరుద్ఘాటించాను. మా నమ్మకమే ఇప్పుడు నిజమైంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో 8 నియోజకవర్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగింది. మా పరిపాలన బాగుందని ప్రజలు మెచ్చుకున్నారని ఈ ఫలితాలతో అర్థమవుతోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ గెలిపించి.. ప్రజలు మాకు మరో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 3 సీట్లను గెలుచుకోగా.. ఈ ఎన్నికల్లో 8 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. లోక్సభ ఎన్నికల్లో మేం ఆశించిన దానికంటే కొన్ని సీట్లు తక్కువగా వచ్చాయి. ఈ ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి. ఇప్పటివరకు రోజుకు 18 గంటలు పనిచేశాం. ఇకనుంచి మరో రెండు గంటలు అదనంగా పనిచేస్తాం. రాష్ట్రంలో పార్టీ జయాపజయాలకు పూర్తి బాధ్యత నాదే.
భాజపా కోసం భారాస ఆత్మబలిదానం
2019లో భాజపా 4 ఎంపీ సీట్లలో గెలిస్తే.. ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 13.90 శాతం ఓట్లు రాగా.. ఈ ఎన్నికల్లో 35 శాతానికి పెంచుకుంది. భాజపాను గెలిపించేందుకు భారాస నాయకులు ఆత్మబలిదానం చేసుకున్నారు. 2001లో తెదేపాకు కేసీఆర్ రాజీనామా చేసి, సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి.. 2023 డిసెంబరు వరకూ సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ప్రతిసారీ భారాసకు 25-30 వేల నుంచి 1.20 లక్షల వరకూ మెజారిటీ వచ్చింది. ఈ లోక్సభ ఎన్నికల్లో హరీశ్రావు తన ఓట్లను పూర్తిగా భాజపాకు బదిలీ చేశారు. సిద్దిపేట సెగ్మెంట్లో భారాస అభ్యర్థికి సుమారు 65 వేల ఓట్లు వస్తే.. భాజపా అభ్యర్థి రఘునందన్రావుకు 63 వేలు వచ్చాయి. ఇక్కడ భారాస 2,500 ఓట్లు మాత్రమే ఎక్కువగా సాధించింది. ఇప్పటివరకూ సిద్దిపేట నియోజకవర్గంపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారాస.. కేసీఆర్, హరీశ్రావులు తమ ఓట్లను భాజపాకు బదిలీ చేయించడం ద్వారా బలహీనవర్గాలకు చెందిన అభ్యర్థిని ఓడించారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని నమ్మించి మోసం చేశారు. సిద్దిపేటలో తక్కువ ఓట్లు రావడం వల్లే మెదక్ లోక్సభ స్థానంలో మేం ఓడిపోయాం. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు పొందిన భారాస.. ఈ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపోయింది. 21 శాతం భారాస ఓట్లను భాజపాకు బదిలీ చేశారు. తద్వారా 8 లోక్సభ స్థానాల్లో భాజపా గెలిచింది. వీటిలో ఏడింటిలో భారాస డిపాజిట్లనూ కోల్పోయింది. ఫీనిక్స్ పక్షిలాగా మళ్లీ పుంజుకుంటామని కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు బూడిదయ్యారు. మళ్లీ పుట్టేదేమీ లేదు. ఇక బూడిదే మీకు మిగిలింది.
మోదీ కరిష్మాకు కాలం చెల్లింది
కేంద్రంలో 2014, 2019లలో తమ విధానం, సిద్ధాంతం, మ్యానిఫెస్టోపై భాజపా నేతలు ఓట్లు అడిగారు. ఈ ఎన్నికల్లో మోదీ గ్యారంటీ పేరుతో ఏక వ్యక్తి నాయకత్వంలో వారు ప్రజల్లోకి వెళ్లారు. దీంతో సీట్ల సంఖ్య 303 నుంచి 240కి పడిపోయింది. మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని, ఆయన కరిష్మాకు కాలం చెల్లిందని ప్రజలు తీర్పు ఇచ్చారు. రాముడి పేరు మీద ఓట్ల అడిగిన భాజపాకు దేవుడు కూడా గుణపాఠం చెప్పాడు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 42.9 శాతం ఓట్లు వస్తే.. ఇండియా కూటమికి 41.1 శాతం అంటే దాదాపు సమానంగా వచ్చాయి. సీట్లు కూడా పోటాపోటీగా వచ్చాయి. 140 కోట్ల ప్రజల తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చేస్తున్న డిమాండ్. విలువలు కలిగిన నాయకుడిగా.. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తిగా.. హుందాగా రాజీనామా చేసి తప్పుకొంటే ఆయనకు గౌరవం ఉంటుంది. మూడోసారీ ప్రధానిగా ఉంటానని, కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉంటానని అంటే.. వారు చెబుతున్న రాజకీయ విలువలు చెప్పడానికి మాత్రమేనని, ఆచరించడానికి కాదని దేశ ప్రజలు విశ్వసించాల్సి వస్తుంది.
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రను కేసీఆర్ చేస్తూనే ఉంటారు
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రను కేసీఆర్ నిరంతరం చేస్తూనే ఉంటారు. ఆయన ఒక రాజకీయ జూదగాడు. కుట్రలు, కుతంత్రాలతో మహారాష్ట్రలో శివసేనను మోదీ చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఈ ఎన్నికల్లో ఆయన తీరును అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఆ అనుభవం దృష్ట్యా తెలంగాణలో అదే తరహా ప్రయోగం చేస్తారా? లేదా? అన్నది చూడాలి. ప్రపంచంలోనే కేసీఆర్ అత్యంత అవినీతిపరుడని మోదీయే గతంలో ఆరోపించారు. ఆయనతో ఎలా జట్టుకడతారో ప్రజలకు భాజపా నాయకులు వివరించాలి. వీటన్నింటినీ విశ్లేషించడానికి సమయం పడుతుంది.
డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తాం. అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు జరుగుతాయి. అదే రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఉత్సవాలకు సోనియా గాంధీని పిలవాలనుకుంటున్నాం’’ అని రేవంత్రెడ్డి అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వస్తే వెళ్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ఏ ప్రభుత్వమైనా కొత్తగా ఏర్పాటవుతున్న సందర్భంగా ఆహ్వానించినప్పుడు హాజరుకావడంపై పార్టీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. వ్యక్తిగా నేను నిర్ణయం తీసుకోవడానికి ఉండదు. పార్టీ సూచన మేరకే వ్యవహరించాల్సి ఉంటుంది. సిద్ధాంతపరంగా, రాజకీయపరంగా ఇది పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం. ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకుంటాం. ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది’’ అని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్