Revanth Reddy: నన్ను దెబ్బతీసేందుకు గూడుపుఠాణీ చేస్తున్నారు: రేవంత్
కొడంగల్లో కాంగ్రెస్ను ఓడించి.. తనను కిందపడేయాలని భాజపా, భారాస కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
కొడంగల్: గడిచిన వంద రోజుల్లో కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. కొడంగల్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ నేతలు, ఏడు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బూత్స్థాయి నేతలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. భాజపా, భారాసకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వడంలో మోదీ విఫలమయ్యారని, పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వకుండా గులాబీ పార్టీ వంచించిందని విమర్శించారు.
‘‘కొడంగల్లో కాంగ్రెస్ను ఓడించి.. నన్ను కిందపడేయాలని భాజపా, భారాస కుట్రలు చేస్తున్నాయి. పదేళ్లుగా ప్రధాని మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారు? నన్ను దెబ్బతీయడానికి గూడుపుఠాణీ చేస్తున్నారు. నేను ఎక్కడున్నా.. నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే. ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ