CM Revanth Reddy: హక్కుల కోసం తెలుగువారంతా ఏకమవుదాం: సీఎం రేవంత్రెడ్డి
దిల్లీ నుంచి సుల్తాన్లు వచ్చినా.. ‘విశాఖ ఉక్కు’ను ఒక్క ఇంచ్ కూడా కదిలించలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
విశాఖపట్నం: దిల్లీ నుంచి సుల్తాన్లు వచ్చినా.. ‘విశాఖ ఉక్కు’ను ఒక్క ఇంచ్ కూడా కదిలించలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన ‘న్యాయసాధన సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం షర్మిల నడుం బిగించారు. ఉక్కు సంకల్పంతో సభ పెట్టారు. వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టే వారే ఆయన వారసులవుతారు. ఏపీ ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారు. ప్రశ్నించే నాయకుడు లేకే ప్రధాని మోదీ ఏపీని పట్టించుకోవడం లేదు. దిల్లీని డిమాండ్ చేసి.. కావాల్సింది సాధించుకునే నాయకత్వం ఇప్పుడు లేదు. అందుకే పదేళ్లయినా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు.. పోలవరం పూర్తి కాలేదు.
ప్రశ్నించే గొంతుకలు కావాలి..
భాజపా అంటే.. బాబు, జగన్, పవన్. ఇదే మోదీ బలగం. ఎవరు గెలిచినా ఆయనకు మద్దతిచ్చే వారే. ఈ ప్రాంత సమస్యలపై నిటారుగా కొట్లాడే నాయకులు కావాలి. ఏపీ ప్రజలకు కావాల్సింది పాలకులు కాదు.. ప్రశ్నించే గొంతుకలు. తెలుగువారి హక్కులు కాపాడుకొనేందుకు అంతా ఏకమవుదాం. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని షర్మిల ఇక్కడకు వచ్చారు. ఎవరో వచ్చి విశాఖ ఉక్కును అమ్ముతామంటే ఊరుకోబోమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పోరాటం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. అయినా.. ఏపీ ప్రజల తరఫున నిలబడే నాయకురాలు షర్మిల. 25 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీ స్థానాల్లో గెలిపించండి.. చట్ట సభల్లో మీ కోసం పోరాటం చేస్తారు.ఇక్కడ కాంగ్రెస్ లేదని కొందరు అనుకుంటున్నారు.. కానీ, ఈ సభను చూశాక షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తోంది. షర్మిల నాయకత్వాన్ని బలపరచండి.. అండగా నేనుంటా. ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?