Congress: తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.. హాజరు కానున్న ఖర్గే, రాహుల్‌

తెలంగాణ కాంగ్రెస్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. 

Published : 23 Mar 2024 16:31 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతోపాటు పలువురు ఏఐసీసీ ముఖ్యనాయకులు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఏఐసీసీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను తెలుగులో ఇక్కడ మల్లికార్జున ఖర్గే విడుదల చేస్తారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తున్న ఈ సభ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులు కలిసి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని