Loksabha polls: ఆజాద్ వ్యాఖ్యలకు దీటుగా కాంగ్రెస్ నాలుగు ప్రశ్నలు
భాజపా గెలవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నట్లు అనిపిస్తుందని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాంనబీ ఆజాద్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
దిల్లీ: కాంగ్రెస్ పార్టీ భాజపా గెలవాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుందని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధినేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మంగళవారం ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాము భాజపాను గెలిపించాలనుకుంటున్నామని అనడానికి ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఈసందర్భంగా ఆజాద్కు పలు ప్రశ్నలు సంధించారు.
ఆజాద్ రాజ్యసభ నుంచి పదవీవిరమణ పొందిన సమయంలో ఆయనకు మోదీ భావోద్వేగ వీడ్కోలు పలికిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘రాజ్యసభ నుంచి మీరు రిటైర్డ్ అయినప్పుడు ఎవరు డ్రామా చేశారు’ అని ప్రశ్నించారు. ‘భాజపా మద్దతుతో సౌత్ అవెన్యూ బంగ్లాను ఎవరు ఆక్రమిస్తున్నారు?’ అని అడిగారు. ‘జమ్మూకశ్మీర్లో భాజపా తరపున ఉన్నది ఎవరు’ అని నిలదీశారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్ను నిరాకరించడాన్ని కాంగ్రెస్ నేత ప్రస్తావించారు. ‘పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి పద్మభూషణ్ను నిరాకరించినప్పటికీ, భాజపా నుంచి పద్మ అవార్డును ఎవరు స్వీకరించారు?’ అని పద్మభూషణ్ అవార్డును ఆజాద్ అంగీకరించడాన్ని జైరాం రమేష్ ప్రశ్నించారు. వీటన్నిటికీ సమాధానాలు తెలియజేయాలని ఆజాద్ను కోరారు.
కాగా సోమవారం గులాంనబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ ‘‘భాజపాతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంటుంది. పార్టీలో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారు. కానీ, అగ్రనాయకత్వం వారి మాటలు వినిపించుకోలేదు. సమస్యలు లేవనెత్తినప్పుడు.. మేమంతా భాజపా భాష మాట్లాడుతున్నామని విమర్శించేది. కానీ ఆ పార్టీనే భాజపాను గెలిపించాలని కోరుకుంటున్నట్లు నాకు చాలాసార్లు అనిపించింది’’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్